BigTV English
Advertisement

Rammohan Naidu: తెలంగాణ నుంచి ఇద్దరు, రామ్మోహన్ తొలి పలుకులు, ఆ విషయంలో..

Rammohan Naidu: తెలంగాణ నుంచి ఇద్దరు, రామ్మోహన్ తొలి పలుకులు, ఆ విషయంలో..

Rammohan naidu: కొద్దిగంటల్లో కేంద్రంలోని మోదీ కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ తరపున ఏపీ నుంచి ముగ్గురు మంత్రులకు చోటు దక్కనుంది. వారిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒకరు. తొలిసారి ఓ న్యూస్ ఏజెన్సీతో ఆయన మాట్లాడారు.


చాలాకాలం తర్వాత కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ వస్తుందన్నారు. ఇప్పటివరకు తాము ఎలాంటి డిమాండ్లను పెట్టలేదన్నారు. వారితో మా మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని, తామంతా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ల విషయంలో తమ స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదని మనసులోని మాట బయటపెట్టారు.

మరోవైపు కేంద్రప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తి అయ్యింది. ఐదుగురు కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు చోటు లభించింది. ఒకరు కేంద్రమంత్రి కాగా మరొకరికి సహాయమంత్రిగా ఛాన్స్ లభించనుంది. పట్టణాభివృద్ధి, ఐటీ, సామాజిక న్యాయ శాఖలను తెలుగుదేశంకు కేటాయించే అవకాశం ఉంది.


ALSO READ: అమెరికా నుంచి వచ్చిన విజయమ్మ, జగన్‌బాబుకు ఓదార్పు.. దూకుడు వద్దంటూ

కేంద్రమంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు లభించినట్టు సమాచారం. ఇద్దరు కలిసి ప్రధాని నివాసంలో జరిగే తేనీటి విందు‌కు హాజరయ్యారు. ఇదిలావుండగా లోక్‌సభ‌కు ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, బస్వరాజ్ బొమ్మైల్లో ఒకరిని స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.

 

 

Tags

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×