TTD : తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16న ఈ వేడుకలు నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. ఏటా సూర్య జయంతి రోజు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 7 వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి రోజు నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
TTD : తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16న ఈ వేడుకలు నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. ఏటా సూర్య జయంతి రోజు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 7 వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి రోజు నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
వాహన సేవల..
ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ నిర్వహిస్తారు.ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ సాగుతుంది.
ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ చేస్తారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ ,సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ సాగుతుంది.రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి ఉత్సావాలు ముగుస్తాయి.