Andhra Pradesh: విద్యుత్ బిల్లులు తగ్గింపు పై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1500 మెగావాట్ల సామర్ధ్యంతో బ్యాటరీ ఎనర్జీ సిస్టం ఏర్పాటు చేశారు. ఈ పథకంలో బీసీ వినియోగదారులకు గరిష్టంగా రూ. 98 వేలు సబ్సిడీ ప్రకటించారు. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామన్నారు. యూనిట్ పై 13 పైసలు తగ్గించనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ట్రూ డౌన్ విధానం అమలు చేస్తున్నామని నవంబర్ నెల నుంచి ట్రూ డౌన్ అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించామన్నారు.