E-Paper
Advertisement

Ntr Baby Kit: ఏపీలో ఆ పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రెండు వేలు, కొత్తగా ఆ రెండు

Ntr Baby Kit: ఏపీలో ఆ పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రెండు వేలు, కొత్తగా ఆ రెండు
Advertisement

Ntr Baby Kit: ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్‌ని పథకాన్ని మళ్లీ మొదలు పెట్టనుంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ కిట్ ను అందజేస్తారు. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ కిట్‌లోకి రెండు వస్తువులు చేరాయి. ఆ కిట్ విలువ దాదాపు రెండు వేల రూపాయలు.

మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్

Advertisement

2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మంచి పథకాలను తీసుకొచ్చింది. వాటిలో కొన్నింటిని కాస్త మార్పులు చేర్పులు చేసి మొదలుపెట్టింది.. ఇంకా కంటిన్యూ అవుతోంది. అలాంటి వాటిలో ఎన్టీఆర్ బేబీ కిట్ ఒకటి.  గతంలో ఈ కిట్ లో 11 వస్తువులు ఉండగా, ఇప్పుడు 13కు చేర్చారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆ స్కీమ్‌ని మొదలుపెట్టాలని ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో 26 జిల్లాల్లోని డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లు, జీజీహెచ్‌లకు రెండేళ్ల పాటు రేట్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలో కిట్లు సరఫరా చేస్తుంది APMSIDC సంస్థ. రాష్ట్రంలో ప్రతీ ఏటా సుమారు 3.20 లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

కొత్తగా ఆ రెండు వస్తువులు

2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన జగన్‌ సర్కారు ఆపేసింది. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అదనంగా రెండు వస్తువులు చేరాయి. దీంతో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. పథకం అమలుకు రూ.65 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వ అంచనా.

ALSO READ:  ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త

ఎన్టీఆర్ కిట్‌లో ఉండే వస్తువులు ఏంటి? దోమ తెరతో కూడిన పరుపు, వాటర్‌ ప్రూఫ్‌ షీటు, దుస్తులు, న్యాప్కిన్లు, తువాలు, సబ్బు-దానికి సంబంధించిన బాక్సు, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మలు ఇలా 11 వస్తువులు ఉండేవి. అదనంగా ఫోల్డబుల్‌ బెడ్, ఓ బ్యాగును చేర్చారు. వీటిలో కిట్‌లో వస్తువుల సంఖ్య 13కి చేరింది. గతంలో ఒక్కో కిట్‌కు సుమారు రూ.1,504 ఖర్చు అయ్యేది.

కొత్తగా చేర్చిన రెండు వస్తువుల వల్ల అదనంగా రూ.450 పెరిగింది. ఆ లెక్కన ఒక్కో కిట్‌కు రూ.1954 ఖర్చు అవుతోందన్నమాట. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను వైద్యా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ చేస్తోంది.  ఈ పథకం నవంబర్ 14 నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.  ఇప్పటికే ప్రభుత్వం పలు సర్వేలు చేపట్టింది. దాని ఆధారంగా ఎంత ఖర్చు అవుతుందో ఓ అంచనాకు వచ్చింది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×