E-Paper
Advertisement

Sajjala Ramakrishna: ముందుగానే ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది.. ఎందుకంటే: సజ్జల రామకృష్ణ

Sajjala Ramakrishna: ముందుగానే ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది.. ఎందుకంటే: సజ్జల రామకృష్ణ
Advertisement

Sajjala Ramakrishna Comments On Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వేలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు కేవలం ఎన్డీఏ కోసం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు ఉందన్నారు. అందుకే కూటమిలో ఉన్న టీడీపీకి మేలు చేయాలని ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఇచ్చారని  విమర్శించారు.

ఢిల్లీలో కూర్చుని ఇక్కడి ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేకుండా సర్వేలు చేసి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా సరైన ఎగ్జిట్ పోల్స్ ఎవరూ చెప్పలేరని అన్నారు. లోకల్ సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పారన్నారు. ఎన్నికల కమిషన్ కూడా పక్షపాత దోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందుకే అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటోందని  మండిపడ్డారు.

Advertisement

ఎన్నికల్లో తాము గెలుస్తామని టీడీపీ హడావుడి చేస్తుందని అన్నారు. లోకల్ సర్వేలు వైసీపీ మళ్లీ గెలుస్తుందని స్పష్టంగా చెబుతున్నాయని వెల్లడించారు. అందుకే ఓటమికి తాము కారణాలు వెతుక్కోవలసిన అవసరం లేదని అన్నారు. 48 గంటల్లోనే ఫలితాలు వస్తాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ రూల్ ఎక్కడా లేని విధంగా ఏపీలో ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో మాత్రమే ఆ ప్రత్యేక వెసులుబాటు ఎందుకు అని అన్నారు. పిన్నెల్లికి బెయిల్ వస్తే మళ్లీ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Also Read: ఎగ్జిట్ ఫలితాలు తర్వాత, పీకె తొలిసారి రియాక్షన్

Advertisement

కౌంటింగ్ లో అక్రమాలు చేయాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. తెర వెనక కుట్ర చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో.. ఎందుకు వెళ్లారో చెప్పాలని తెలిపారు. పాజిటివ్ ఓటు బ్యాంక్ తమ వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెల్లడయితే స్వీట్ పంచుకోవడం కుదరదని టీడీపీ ముందుగానే సంబరాలు చేసుకుంటుందని చురకలు అంటించారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×