Anakapalli News: అనకాపల్లి టౌన్లో జరిగిన సంపూర్ణ నారాయణీయం పారాయణకు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. శ్రీకృష్ణ మాధురీయం బృందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది భక్తులు పాల్గొని పారాయణ చేశారు.
అనకాపల్లి టౌన్లో ఆధ్యాత్మిక కార్యక్రమం
అనకాపల్లి పట్టణంలో కడ్మిశెట్టి నాగ మాధురి ఆధ్వర్యంలో జరిగింది. గవరపాలెం సత్యాస్ లక్ష్మీ గ్రాండ్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ భక్తి పారాయణంకు నారాయణీయం సాధకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు మొదలైన ఈ పారాయణ కార్యక్రమం 4 గంటలకు సాగింది. సంపూర్ణ నారాయణీంకు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.
అనకాపల్లికి చెందిన కడ్మిశెట్టి నాగ మాధురి నవీన్ చేపట్టిన నారాయణీయంలో 1,036 శ్లోకాలతో భారీ సమూహిక పఠనాన్ని విజయవంతంగా నిర్వహించింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థ శ్రీ కృష్ణ మాధురియం ఆధ్వర్యంలో జరిగింది.
సంపూర్ణ నారాయణీయం పారాయణకు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
భారీగా భక్త బృందం, సమిష్టి భాగస్వామ్యం, ఆధ్యాత్మిక సాహిత్యాన్ని పరిరక్షించడంలో అంకిత భావాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అధికారికంగా గుర్తించబడింది. భక్తులు భక్తిశ్రద్ధలతో నారాయణీయాన్ని పఠించారు. ఇప్పుడు టెక్ యుగంలో ఇలాంటి కార్యక్రమం బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం కొనమెరుపు.