BigTV English

Sharmila : క్రైస్తవ వ్యతిరేకి జగన్.. మణిపూర్ విధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదు..?

Sharmila : ఏపీలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వైఎస్‌ షర్మిల తన అన్న సోదరుడు సీఎం జగన్‌ను టార్గెట్‌ చేశారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో మణిపూర్‌ ఘటనపై స్పందించిన షర్మిల.. జగన్‌ క్రైస్తవుడంటూ నొక్కి మరీ చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Sharmila : క్రైస్తవ వ్యతిరేకి జగన్.. మణిపూర్ విధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదు..?
AP Politics

YS Sharmila congress news(AP politics):

ఏపీలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వైఎస్‌ షర్మిల తన అన్న సోదరుడు సీఎం జగన్‌ను టార్గెట్‌ చేశారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో మణిపూర్‌ ఘటనపై స్పందించిన షర్మిల.. జగన్‌ క్రైస్తవుడంటూ నొక్కి మరీ చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.


పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె అన్న సీఎం జగన్‌తోపాటు.. టీడీపీ, బీజేపీలను టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే,.. ఈ సందర్భంగా మత ప్రస్తావన తీసుకువచ్చారు షర్మిల. జగన్‌ క్రైస్తవుడై ఉండి… మణిపూర్‌లో విధ్వంస ఘటనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

మణిపూర్ రాష్ట్రంలో 2 వేల చర్చిలను ధ్వంసం చేసినా.. 60 వేల మంది నిర్వాసితులయినా ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. క్రైస్తవుల కడుపు మండిపోతుంటే సాటి క్రిస్టియన్‌ అయి ఉండి నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తొత్తు కాబట్టే సైలెంట్‌ అయ్యారని విమర్శించారు. అయితే,.. ఈ వ్యాఖ్యల వెనుక ఓటు రాజకీయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్టియన్ల ఓటు బ్యాంకింగ్‌ను తన వైపుకి తిప్పుకునేందుకే మణిపూర్‌ ఘటన, జగన్‌పై మత ప్రస్తావన తీసుకువచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


Tags

Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×