E-Paper
Advertisement

Sharmila : క్రైస్తవ వ్యతిరేకి జగన్.. మణిపూర్ విధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదు..?

Sharmila : ఏపీలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వైఎస్‌ షర్మిల తన అన్న సోదరుడు సీఎం జగన్‌ను టార్గెట్‌ చేశారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో మణిపూర్‌ ఘటనపై స్పందించిన షర్మిల.. జగన్‌ క్రైస్తవుడంటూ నొక్కి మరీ చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Sharmila : క్రైస్తవ వ్యతిరేకి జగన్.. మణిపూర్ విధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదు..?
Advertisement
AP Politics

YS Sharmila congress news(AP politics):

ఏపీలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వైఎస్‌ షర్మిల తన అన్న సోదరుడు సీఎం జగన్‌ను టార్గెట్‌ చేశారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో మణిపూర్‌ ఘటనపై స్పందించిన షర్మిల.. జగన్‌ క్రైస్తవుడంటూ నొక్కి మరీ చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె అన్న సీఎం జగన్‌తోపాటు.. టీడీపీ, బీజేపీలను టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే,.. ఈ సందర్భంగా మత ప్రస్తావన తీసుకువచ్చారు షర్మిల. జగన్‌ క్రైస్తవుడై ఉండి… మణిపూర్‌లో విధ్వంస ఘటనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

Advertisement

మణిపూర్ రాష్ట్రంలో 2 వేల చర్చిలను ధ్వంసం చేసినా.. 60 వేల మంది నిర్వాసితులయినా ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. క్రైస్తవుల కడుపు మండిపోతుంటే సాటి క్రిస్టియన్‌ అయి ఉండి నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తొత్తు కాబట్టే సైలెంట్‌ అయ్యారని విమర్శించారు. అయితే,.. ఈ వ్యాఖ్యల వెనుక ఓటు రాజకీయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్టియన్ల ఓటు బ్యాంకింగ్‌ను తన వైపుకి తిప్పుకునేందుకే మణిపూర్‌ ఘటన, జగన్‌పై మత ప్రస్తావన తీసుకువచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Tags

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×