E-Paper
Advertisement

Anganwadi : అర్థరాత్రి ఉద్రిక్తత.. అంగన్ వాడీల దీక్షకు భగ్నం ..

Anganwadi : విజయవాడ ధర్నాచౌక్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన వైసీపీ సర్కారు.. తాజాగా వారి దీక్షలను కూడా భగ్నం చేసింది. దీంతో అర్ధరాత్రి ధర్నా చౌక్ లోని అంగన్ వాడీల టెంట్లను పోలీసులు పీకేశారు. తమ దీక్ష భగ్నం చేయడంతో అంగన్ వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంగన్ వాడీలను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు.. విధులకు హాజరు కాని అంగన్ వాడీలను తొలగించాలని పలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు కూడా సిద్ధం చేస్తున్నారు.

Anganwadi : అర్థరాత్రి ఉద్రిక్తత.. అంగన్ వాడీల దీక్షకు భగ్నం ..
Anganwadi strike in ap latest news

Anganwadi strike in ap latest news(AP news live):

విజయవాడ ధర్నాచౌక్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన వైసీపీ సర్కారు.. తాజాగా వారి దీక్షలను కూడా భగ్నం చేసింది. దీంతో అర్ధరాత్రి ధర్నా చౌక్ లోని అంగన్ వాడీల టెంట్లను పోలీసులు పీకేశారు. తమ దీక్ష భగ్నం చేయడంతో అంగన్ వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంగన్ వాడీలను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు.. విధులకు హాజరు కాని అంగన్ వాడీలను తొలగించాలని పలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు కూడా సిద్ధం చేస్తున్నారు.

తిరుపతిలోనూ అంగన్ వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఛలో విజయవాడకు బయల్దేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 40 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేయగా, వారు స్టేషన్‌లోనే నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బస్సుల్లో బయలుదేరిన అంగన్‌వాడీలను కావలి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను కావలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్దకు ఆదివారం రాత్రే అంగన్‌వాడీలు భారీగా చేరుకుని నిద్రించారు. అక్కడి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు.

ఏపీవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్‌కు ఇచ్చేందుకు తరలిరావాలని అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపట్టనున్నట్లు సమాచారం. మొదట విజయనగరం, ప్రకాశం, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల జిల్లాల కార్యకర్తలు, ఆయాలు.. సోమవారం విజయవాడకు చేరుకునేలా ప్రణాళిక రచించారు. మిగతా జిల్లాల వారు.. మంగళవారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ఆయాలను పలుచోట్ల బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అదుపులోకి తీసుకుంటున్నారు.

.

.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×