Andhra News: కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శ్రేయ గ్రూప్తోపాటు సహనిందితులు హేమంత్ కుమార్ రాయ్, అతని భార్య సంగీతారాయ్ పేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది కూటమి సర్కారు. ఇందులో భాగంగా జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాలలో సంస్థకు ఉన్న 51.55 ఎకరాల భూమి జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతించింది. దీని విలువ 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.
అధిక వడ్డీలు ఇస్తామంటూ పలు రకాల స్కీములను ప్రవేశపెట్టి మొత్తం 8 వేల 128 మంది డిపాజిటర్ల నుంచి 206 కోట్లు కొల్లగొట్టింది శ్రేయ గ్రూప్. కర్నూలు బిర్లా కాంపౌండ్లో శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రెవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీసు ఏర్పాటు చేసి భారీ మోసానికి పాల్పడింది.
ఈ కేసులో ఎ1గా శ్రేయ గ్రూప్, ఎ2గా హేమంత్ కుమార్ రాయ్, ఎ3గా సంగీత రాయ్ని చేర్చి దర్యాప్తు చేసింది సీఐడీ. భారీ మోసం జరిగిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు అనుమతించింది ఏపీ సర్కారు.
ALSO READ: Karimnagar district: వాటర్ ఫాల్ను తలపిస్తున్న హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్ లైన్.. కరీంనగర్ జిల్లాలో ఘటన
శ్రేయ గ్రూప్ సంస్థల ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
కర్నూలులో శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ భారీ మోసం
రూ.206 కోట్లు కొల్లగొట్టిన శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఆదేశం
8,128 డిపాజిటర్ల నుంచి డబ్బు వసూలు చేసిన శ్రేయ గ్రూప్
నిందితులు హేమంత్ రాయ్, సంగీతారాయ్ పేరుతో ఉన్న ఆస్తుల… pic.twitter.com/RmuUs5KDrM
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026