- Advertisement -
కల్యాణోత్సవాన్ని నేరుగా చూడలేని వారి కోసం 28 LED స్క్రీన్లను అమర్చారు. గ్యాలరీల్లో ఉండే భక్తుల కోసం 200కి పైగా ఎయిర్ కూలర్లను అమర్చారు. సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందించనున్నారు. సీతారాముల కళ్యాణ వేదికను ఆదివారం సాయంత్రం జేఈవో శ్రీ వీరబ్రహ్మం జిల్లా జేసీ శ్రీ గణేష్ కుమార్ మరియు ఇతర యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.
- Advertisement -
Also Read: ఏపీ పదో తరగతి ఫలితాలు నేడే.. మీ ఫోన్ నంబర్ కే రిజల్ట్స్.. ఇలా చేయండి!
ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో అంగరంగ వైభవంగా పున్నమి వెలుగుల్లో వైభవంగా సీతారాముల పెళ్లి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవం సంధర్భంగా ఆ ప్రదేశాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -