E-Paper
Advertisement

Water Dogs Attack: శ్రీశైలం పాతాళ గంగలో నీటి కుక్కల దాడి.. పలువురు భక్తులకు గాయాలు

Water Dogs Attack: శ్రీశైలం పాతాళ గంగలో నీటి కుక్కల దాడి.. పలువురు భక్తులకు గాయాలు
Advertisement

Water Dogs Attack: శ్రీశైలం పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు భయాందోళన నెలకొంది. ఇటీవల అక్కడ నీటి కుక్కల దాడులు పెరిగిపోతుండటంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనలో పాతాళ గంగలో స్నానాలు చేస్తున్న ఐదుగురు భక్తులపై నీటి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేసి గాయపరిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని నీటిలోకి లాగేందుకు కూడా ప్రయత్నించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఉదయం పాతాళ గంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా.. ఒక్కసారిగా నీటిలో నుంచి రెండు నీటి కుక్కలు బయటకు వచ్చి భక్తులపై దాడి చేశాయని వారు చెబుతున్నారు.

Advertisement

ఇటీవలి కాలంలో పాతాళ గంగ వద్ద నీటి కుక్కల సంచారం ఎక్కువవుతోందని, అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానికంగా పాతాళ గంగ పవిత్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాసం వంటి ప్రత్యేక రోజుల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇలాంటి సమయంలో నీటి కుక్కల బెడద ఉండటం భక్తుల భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతోంది.

Also Read: రైల్వే స్టేషన్‌లో భారీ శబ్ధంతో బాంబు పేలుడు.. ఘటనపై ఎస్పీ క్లారిటీ

Advertisement

ఈ ఘటనపై స్పందించిన కొందరు స్థానికులు కూడా అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీటి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, నదీ తీర ప్రాంతాన్ని కంచెతో ఏర్పాటు చేయాలని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా పాతాళ గంగ వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

 

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×