Big Stories

Tadepalligudem Blast : బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి..

Tadepalligudem Blast : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగినప్పుడు ఆ ప్రాంతం కొంత కంపించినట్లు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు.

- Advertisement -

సమాచారం అందుకున్న ఫైర్‌సింబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినివారికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని డిప్యుటీ సీఎం కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.

- Advertisement -

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఎంతవరకైతే అంతవరకు సహాయం అందిస్తామని అన్నారు. ఇలాంటి ఘటను మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. ఇటీవల దీపావలి పండగ సందర్భంగా అధికారులు ఈ కర్మాగారాన్ని పరిశీలించారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News