![Nandyal TDP News Nandyal TDP News](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/11/4a0a330f3fe04fab7704255c4230dc6d.jpg)
Nandyal TDP News(Andhra pradesh political news today):
నంద్యాలలో తెలుగుతమ్ముళ్ల మధ్య వర్గపోరు బయటపడింది. నంద్యాల టీడీపీ ఇంఛార్జ్గా NMD ఫరూఖ్ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇంఛార్జి మార్పుపై భూమా బ్రహ్మానంద రెడ్డి వర్గం.. ఆగ్రహానికి గురైంది. కార్యకర్తలకు అండగా నిలిచిన భూమా బ్రహ్మానంద రెడ్డిని అధిష్టానం గుర్తించకపోవడంపై.. ఆ వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్డు,గ్రామ ఇంచార్జులు,బూత్ కన్వీనర్లు, క్లస్టర్ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేశారు.
తమ రాజీనామాలను పోస్టు ద్వారా అధిష్టానానికి పంపాలని భూమా వర్గం నిర్ణయించుకుంది. తన అనుచరులు ఎవరూ…రాజీనామా చేయవద్దని భూమా బ్రహ్మానంద రెడ్డి వారించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత… రాజీనామాలపై నిర్ణయం తీసుకుందామని సర్థి చెప్పినట్లు సమాచారం.
మా నాయకుడికి మర్యాద దక్కనప్పుడు.. మాకు పదవులు ఎందుకంటున్నారు భూమా వర్గీయులు. భూమాకి టిక్కెట్ ఇవ్వాలంటూ డీజిల్ పోసుకుని.. ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో… విషయం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ మహిళను గుర్రం లక్ష్మిగా గుర్తించిన నేతలు.. ఆమెను ఆపి.. సర్థి చెప్పారు. తోటి కార్యకర్తలు బాటిల్ లాగేసుకోవటంతో ప్రమాదం తప్పింది.