Big Stories

Nandyal TDP | నంద్యాలలో టిడిపి వర్గాల మూకుమ్మడి రాజీనామా!

Nandyal TDP News

Nandyal TDP News(Andhra pradesh political news today):

నంద్యాలలో తెలుగుతమ్ముళ్ల మధ్య వర్గపోరు బయటపడింది. నంద్యాల టీడీపీ ఇంఛార్జ్‌గా NMD ఫరూఖ్‌ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇంఛార్జి మార్పుపై భూమా బ్రహ్మానంద రెడ్డి వర్గం.. ఆగ్రహానికి గురైంది. కార్యకర్తలకు అండగా నిలిచిన భూమా బ్రహ్మానంద రెడ్డిని అధిష్టానం గుర్తించకపోవడంపై.. ఆ వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్డు,గ్రామ ఇంచార్జులు,బూత్ కన్వీనర్లు, క్లస్టర్ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేశారు.

- Advertisement -

తమ రాజీనామాలను పోస్టు ద్వారా అధిష్టానానికి పంపాలని భూమా వర్గం నిర్ణయించుకుంది. తన అనుచరులు ఎవరూ…రాజీనామా చేయవద్దని భూమా బ్రహ్మానంద రెడ్డి వారించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత… రాజీనామాలపై నిర్ణయం తీసుకుందామని సర్థి చెప్పినట్లు సమాచారం.

- Advertisement -

మా నాయకుడికి మర్యాద దక్కనప్పుడు.. మాకు పదవులు ఎందుకంటున్నారు భూమా వర్గీయులు. భూమాకి టిక్కెట్ ఇవ్వాలంటూ డీజిల్ పోసుకుని.. ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో… విషయం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ మహిళను గుర్రం లక్ష్మిగా గుర్తించిన నేతలు.. ఆమెను ఆపి.. సర్థి చెప్పారు. తోటి కార్యకర్తలు బాటిల్ లాగేసుకోవటంతో ప్రమాదం తప్పింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News