Big Stories

Uttarkhand Tunnel Rescue : సొరంగం నుంచి సురక్షితంగా బయటకువచ్చిన కార్మికులు!

Uttarkhand Tunnel Rescue : ఉత్తరాఖండ్‌‌ ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్కియారీ సొరంగం నవంబర్ 12న కూలిపోయి.. 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఆ 41 మంది కార్మికులను NDRF(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం మంగళవారం బయటకు తీయగలిగింది.

- Advertisement -

గత 16 రోజులుగా ఈ 41 మంది కార్మికులు సొరంగంలోపలే చిక్కుకుపోయి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వారిని కాపాడేందుకు అత్యాధునిక టెక్నాలజీ వైఫల్యం చెందడంతో పాత విధానమైన ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్’ ద్వారా తవ్వకం చేసి ఒక గొట్టం నుంచి కార్మికులను బయటకు తీశారు.

- Advertisement -

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనా స్థలానికి చేరుకొని బయటకు వచ్చిన కార్మికులను పలకరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News