BigTV English

TDP: వివేకా హత్య వ్యవహారంపై బుక్ రిలీజ్ చేసిన టీడీపీ

TDP: వివేకా హత్య వ్యవహారంపై బుక్ రిలీజ్ చేసిన టీడీపీ

TDP: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కేసును సుప్రీంకోర్టు తెలంగాణ సీబీఐకి బదిలీ చేసింది. ఏపీలో తమకు న్యాయం జరగదని.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.


ఇక వివేకా హత్య జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై తెలుగు దేశం పార్టీ ఓ పుస్తకాన్ని రూపొందించింది. దానిని జగనాసుర రక్తచరిత్ర పేరుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండ ఉమ తదితరులు శుక్రవారం విడుదల చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై వివరిస్తూ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

వైఎస్ వివేకాను చంద్రబాబే హత్య చేయించారని 2019 ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. వివేకా గుండెపోటుతో చనిపోయాడని చెప్పి.. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. ఈకేసులోని అంశాలను వివరిస్తూ.. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని వెల్లడించారు.


Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×