E-Paper
Advertisement

Chandrababu Naidu: సమస్యలు చెప్పుకోండి.. ఆలకిస్తాం!

Chandrababu Naidu: సమస్యలు చెప్పుకోండి.. ఆలకిస్తాం!

TDP Office: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజల సమస్యలు నేరుగా ఆలకించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించారు. పది రోజులపాటు పార్టీ శ్రేణులు, ప్రజలకు నేరుగా తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు. వారి వద్ద నుంచి సమస్యలు స్వీకరించి సమస్యలను పరిష్కరించడానికి వీరు కృషి చేయనున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ శ్రేణులు, ప్రజలు తమ సమస్యలు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలని టీడీపీ పేర్కొంది.

పది రోజులపాటు రోజుకో మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు ఈ సమస్యలు ఆలకించడానికి అందుబాటులో ఉండాలని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం కార్యాచరణ రూపొందించింది.

వినతులు స్వీకరించే మంత్రుల జాబితా ఇలా ఉన్నది. 17వ తేదీన ఎస్ సవిత, 18వ తేదీన ఎన్ఎండీ ఫరూక్, 22వ తేదీన గుమ్మడి సంధ్యారాణి, 23వ తేదీన కొల్లు రవీంద్ర, 24వ తేదీన అనగాని సత్యప్రసాద్, 25వ తేదీన వాసంశెట్టి సుభాష్, 29వ తేదీన కొండపల్లి శ్రీనివాస్, 30వ తేదీన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, 31వ తేదీన బిసి జనార్ధన్ రెడ్డిలతోపాటు 19, 26వ తేదీల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌లు వినతులు స్వీకరిస్తారు.

ఇక టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉండే జాతీయ నాయకుల వివరాలు ఇలా ఉన్నాయి. 17వ తేదీన బొల్లినేని రామారావు, 18వ తేదీన వైకుంఠం ప్రభాకర్ చౌదరి, 22వ తేదీన కావలి ప్రతిభ భారతి, 23వ తేదీన కొట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, 24వ తేదీన బీద రవిచంద్ర, 25వ తేదీన కెఎస్ జవహర్, 29వ తేదీన పనబాక లక్ష్మి, 30వ తేదీన కంభంపాటి రామ్మోహన్ రావు, 31వ తేదీన తోటా సీతారామ లక్షమిలు వినతులు స్వీకరించడానికి అందుబాటులో ఉంటారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×