BigTV English
Advertisement

Kakinada Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. అన్నదమ్ములు మృతి

Kakinada Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. అన్నదమ్ములు మృతి

Kakinada Road Accident: ఆదివారం ఉదయం కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. గండేపల్లి మండలం మురారి వద్ద ఓ బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ బైక్ ను గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వారి తల్లి తీవ్రగాయాల పాలవ్వగా.. ఆమెను రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఈ ప్రమాద ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన సంగలం దుర్గ (40)కు ముగ్గురు కొడుకులు రాజు (18), ఏసు (18), అఖిల్ (10) ఉన్నారు. కొడుకులతో కలిసి కూలిపనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. కూలిపనుల్లో భాగంగా నర్సీపట్నం వెళ్లిన నలుగురు.. బైక్ పై తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురారి శివారు ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అందరూ కిందపడిపోయారు.

Also Read : వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి


పైకిలేచేలోపే వెనుకనుంచి వచ్చిన ఒక వాహనం బైక్ ను ఢీ కొట్టి వారి మీదినుంచి వెళ్లడంతో.. రాజు, ఏసు, అఖిల్ లు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. తల్లి దుర్గకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×