BigTV English

New Delhi : వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి

New Delhi : వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి

3 Students Dead After Flooding In Delhi Coaching Centre Basement : దేశ రాజధాని న్యూ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి సైతం చేరుకుంటోంది. ఇదే క్రమంలో అక్కడ రాజేంద్ర నగర్ ప్రాంతంలో రోడ్డుకు దిగువగా ఓ కోచింగ్ సెంటర్ నడుస్తోంది. బయట మూమూలు వర్షమే అనుకున్నారు. సరిగ్గా శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో దిగువ ప్రాంతంగా ఉన్న రాజేంద్రనగరకు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. అనుకోని విధంగా వచ్చిన వరద నీటినుండి బయటపడేందుకు విద్యార్థులు ఒక్కసారిగా బయటకు రాబోతుండగా మరింత ఉధృత స్థాయిలో వదర నీరు వచ్చిపడింది. దీనితో దాదాపు 30 మంది విద్యార్థులు వరదనీటిలో చిక్కుకుపోయారు. సహాయక బృందాలు వచ్చే లోగా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. దీనితో ఆందోళనతో తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు.


విద్యార్థి సంఘాల ఆందోళన

మరి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా కోచింగ్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. వర్షం వస్తోందని తెలిసినా కోచింగ్ సెంటర్ లో విద్యార్థులను పంపించకుండా వారి ప్రాణాలతో ఆడుకున్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళనకు దిగారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా అక్కడికి చేరుకుని గత 15 సంవత్సరాలుగా బీజేపీ ఆధీనంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నడుస్తోందని ఇదంతా బీజేపీ అసమర్థతనం బయటపడుతోందని ఆప్ నేతలు విమర్శలకు దిగారు. ఇప్పుడు రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని బీజేపీ నేతలు అంటున్నారు. విద్యార్థుల ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. కోచింగ్ సెంటర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.


మున్సిపల్ అధికారుల తీరు అధ్వానం

రెస్క్సూ టీమ్ రంగంలోకి దిగి విద్యార్థులను కాపాడింది. కాకపోతే ముగ్గురు విద్యార్థులు వరద నీటికి బలయ్యారు. ప్రతి ఏడాదీ సమ్మర్ సీజన్ లోనే డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తా చెదారం తీసివేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని అందరూ బీజేపీ నేతల అసమర్థతను ఎండగడుతున్నారు. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థి వర్షంలోలో ప్రయాణిస్తూ అక్కడే పడివున్న విద్యుత్ తీగను చూసుకోకుండా నీటిలో నడుస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఢిల్లీ పటేల్ నగర్ లో జరిగిన ఈ సంఘటన మరవక ముందే మరో ముగ్గురు కోచింగ్ విద్యార్థులు బలయ్యారు. వర్షాలు కురవకముందే సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావని .. ఇకనైనా ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం ప్రమాదకర ప్రాంతాలను. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Related News

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

Big Stories

×