BigTV English
Advertisement

Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 10 నుంచి వైకుంఠ ద్వారదర్శనం టికెట్లు

Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 10 నుంచి వైకుంఠ ద్వారదర్శనం టికెట్లు

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు ఈఓ ఏ.వీ. ధర్మారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈఓలో పాల్గొన్న ఆయన.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని త్వరలోనే టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుందని వెల్లడించారు. నవంబర్ 10న ఆన్ లైన్ లో 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.


డిసెంబర్ 22న తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం 10 రోజులకు 4.25 లక్షల టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 వర్కింగ్ డేస్ లో వారి ఖాతాలకు ఆ డిపాజిట్ మొత్తాన్ని జమ చేస్తున్నట్లు వివరించారు.

అలాగే నవంబర్ 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వవహించనున్నట్లు తెలిపారు. 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 14న గజవాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమీతీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ వాహనసేవలు జరుగుతాయని వివరించారు.


తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 19న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పుష్పయాగం జరగనుందని తెలిపారు. ఈ మేరకు నవంబర్ 18న అంకురార్పణ నిర్వహిస్తామన్నారు. ఈ పుష్పయాగంలో భక్తులు పాల్గొనేందుకు నవంబర్ 4న 1000 టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామని, టికెట్ ధర రూ.700గా నిర్ణయించామని తెలిపారు. అలాగే 2024కు సంబంధించిన డైరీలు, క్యాలెండర్లు టిటిడి పుస్తకాల అమ్మకం షాపులతో పాటు ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

Related News

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Big Stories

×