E-Paper
Advertisement

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా
Advertisement

Delhi Air Pollution: దేశ రాజధాని దిల్లీలో రోజు రోజుకు గాలి కాలుష్యం తీవ్రతరమవుతుంది. వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దిల్లీకి సాయం చేసేందుకు చైనా ముందుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా దిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత తీవ్రంగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

“చైనా కూడా ఒకప్పుడు తీవ్రమైన వాయు కాలుష్యంతో ఇబ్బంది పడింది. కాలుష్యాన్ని నివారించిన మా ప్రయాణాన్ని భారత్ తో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. భారత్ త్వరలో వాయు కాలుష్యం నివారించే స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నాము” అని యు జింగ్ పోస్ట్ పెట్టారు. గాలి నాణ్యతను వృద్ధి చేసేందుకు చైనా కూడా పోరాడుతుందని, కాలుష్యాన్ని నియంత్రించడంలో తన అనుభవాన్ని పంచుకోవడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని తెలిపారు.

చైనా నియంత్రణ చర్యలు

Advertisement

‘ఒకప్పుడు పొగమంచుతో ఇబ్బంది పడిన చైనా, గాలి నాణ్యతను గణనీయంగా పెంచుకునే క్రమంలో విజయాలు సాధించింది. చైనా రాజధాని బీజింగ్‌తో పాటు పలు నగరాలు, పారిశ్రామిక కేంద్రాల్లో కాలుష్యం తీవ్రంగా ఉండేది. చైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని నియంత్రణ చర్యలు తీసుకోవడంతో వాయు కాలుష్యం తగ్గింది. చైనా గాలి నాణ్యత ప్రమాణాలను నిర్దేశించి కచ్చితత్వంగా అమలు చేస్తుంది. వాటిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు విధించింది. దీంతో మహానగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది’ అని యు జింగ్ తెలిపారు.

దిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు

మంగళవారం దిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు “తీవ్రమైన” స్థాయిలో ఉన్నాయి. నగరంలో గాలి నాణ్యత AQI 420గా నమోదైంది. అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఆనంద్ విహార్ (403), అశోక్ విహార్ (370) ఉన్నాయి. బవానా, బురారి క్రాసింగ్ రెండూ 390 కంటే ఎక్కువ ఏక్యూఐ స్థాయిలను నమోదు చేశాయి. నోయిడాలో గాలి నాణ్యత క్రమంగా తక్కువగా ఉంది. సెక్టార్ 125 కూడా గాలి నాణ్యతలో దిగజారుతుంది. సెక్టార్ 116లో 357, సెక్టార్ 62 ఏక్యూఐ స్థాయి 323కు చేరింది.

Advertisement

Also Read: TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

ఘజియాబాద్‌లో గాలి నాణ్యత మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ “తీవ్రమైన” గాలి నాణ్యత ప్రమాణాలు(AQI) 420గా నమోదైంది. వసుంధరలో 389 , సంజయ్ నగర్ 360, ఇందిరాపురం 334 ఏక్యూఐ నమోదయ్యాయి. న్యూ దిల్లీలో కలుషిత గాలి పీల్చడం వలన శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని వైద్యులు తెలిపారు. కంటి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, ఉబ్బసం లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×