E-Paper
Advertisement

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?
Advertisement

Amaravati News: ఏపీలో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్నాయా? ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? లేకుంటే వేటు ఎదుర్కొంటారా? స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలతో ఆ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైందా? స్పీకర్ వ్యాఖ్యలు వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఈసారి అసెంబ్లీకి రాకుండే వేటు ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు ఖాయమా?

Advertisement

వైసీపీలోని 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్దమవుతున్నారు స్పీకర్. రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలపై పరిశీలన చేస్తున్నామన్నారు. మాజీ సీఎం జగన్ తప్ప,  ఆ పార్టీకి చెందిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఏడాదిన్నరగా జీతాలు తీసుకొంటున్నారని వ్యాఖ్యానించారు.

ఒక ఉద్యోగి ఆఫీసుకు రాకుంటే సస్పెండ్ చేస్తున్నామని, మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి  రాకుంటే తొలగించవద్దా? అంటూ ప్రశ్నించారు. ఈ లెక్కన వచ్చే సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.  అసెంబ్లీకి వెళ్లి లైవ్‌లో కనిపించాలని వైసీపీ ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు.

Advertisement

స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యల వెనుక

అలాగని పార్టీ అధినేత నిర్ణయాన్ని ధిక్కరించలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసెంబ్లీకి వెళ్లమని పార్టీ ఎమ్మెల్యేలకు చెబుతారా? వద్దంటారా? ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నట్లు వైసీపీ నుంచి చిన్నపాటి ఫీలర్లు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో వారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారింది.

ALSO READ: జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు, మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ వ్యాఖ్యల వ్యవహారం వైసీపీలో ముసలం మొదలవ్వడం ఖాయమని అనేవాళ్లు లేకపోలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గం సమస్యలను చెప్పుకోవడానికి లేకుండా పోయిందని లోలోపల మదన పడుతున్నారు.  ఈ లెక్కన స్పీకర్ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి.  త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల నాటికి వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎమ్మెల్యేల మాట ఏమోగానీ, అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ మాత్రమే.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×