E-Paper
Advertisement

Tirupati: భర్తను హత్య చేసిన భార్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఎందుకంటే..?

Tirupati: భర్తను హత్య చేసిన భార్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఎందుకంటే..?
Advertisement

Tirupati: ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపిన ఘటన తిరుపతిలోని చిగురువాడలో చోటు చేసుకుంది. ఐదు నెలలు క్రితం వెడురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లికి చెందిన 30ఏళ్ల గోవింద్ ని తిరుపతి రూరల్ చిగురువాడకి చెందిన మానసతో వివాహాం జరిగింది.పెళ్లైన నాటి నుంచి మానస వేరుగా కాపురం పెట్టాలని గోవింద్ పై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ఇక చేసేదేమి లేక తిరుపతి రూరల్ లో చిగురువాడలో భార్య మానసతో కలిసి వేరుగా కాపురం ఉంటున్నారు. మూడు రోజుల క్రితమే కొత్త ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.

పెళ్ళికి ముందే మరొక వ్యక్తి ని ప్రేమించిన మానస.. పెళ్ళి తర్వాత ప్రియుడ్ని పెళ్ళి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. దీంతో ప్రియుడు మానసతో కలిసి గోవిందు నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి గొంతు నులిమి హత్య చేశారు. తన భర్త అప్పుల బాధలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుని మరణించాడని కుటుంబ సభ్యులను, అందరినీ మానస నమ్మించింది.

Advertisement

అంత్యక్రియలు కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా..గోవింద్ మెడపై గాయాలు ఉండటంతో కుటుంబసభ్యలకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు గోవిందుది సాధారణ మరణం కాదని హత్య అని పోలీసులు నిర్ధారించారు.

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×