E-Paper
Advertisement

Visakhapatnam Cracker Blast: భారీ పేలుళ్లు.. విశాఖలో టెన్షన్ టెన్షన్

Visakhapatnam Cracker Blast: భారీ పేలుళ్లు.. విశాఖలో టెన్షన్ టెన్షన్
Advertisement

Visakhapatnam Cracker Blast: విశాఖపట్నం గోపాలపట్నంలోని చంద్రనగర్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక నివాస గృహంలోని మూడవ అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచగా, తయారీ సమయంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు, ఇల్లు పూర్తిగా దెబ్బతిని స్లాబ్ పగిలిపోయింది. బాంబులు పేలుతూ ఆకాశంలోకి సారాజవ్వులు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.

ఈ ప్రమాదం జరిగిన సమయం ఆదివారం కావడంతో, చుట్టుపక్కల ఇళ్లలో నివసించే వారు బయటకు వెళ్లడం వల్ల ఒక పెద్ద ప్రాణాపాయం తప్పింది. అయితే, పేలుడు వల్ల వెలువడిన దట్టమైన పొగను పీల్చడం వల్ల కొందరు అస్వస్థతకు గురయ్యారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తిపై గతంలోనే బాణాసంచా తయారీకి సంబంధించి పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో అధికారులు దాడులు నిర్వహించి మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుని తగలబెట్టినప్పటికీ, అతను పోలీసుల కళ్లు గప్పి రహస్యంగా వేరే గదిని అద్దెకు తీసుకుని ఈ ప్రమాదకరమైన పనిని కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×