BigTV English

Vizag : మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు..

Vizag : మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు..
Vizag


Vizag news today telugu(Breaking news in Andhra Pradesh): నేవీ అధికారి కూతురుపై అత్యాచారం.. విశాఖలో తీవ్ర సంచలనం రేపుతోంది. కంచరపాలెంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై.. ఆమె చదువుతున్న స్కూల్ లో అటెండర్ గా పనిచేస్తున్న సత్యారావు దారుణానికి ఒడిగట్టాడు. కంచరపాలెంలో గతకొంతకాలంగా జరుగుతున్న ఈ అరాచకం ఆలస్యంగా వెలుగుచూసింది. పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్న బాధిత విద్యార్థినిని ట్రాప్ చేసిన అటెండర్ సత్యారావు.. డ్రాయింగ్ నేర్పిస్తా అని చెప్పి దగ్గరయ్యాడు. ఆమెకు తెలియకుండా నగ్న వీడియోలు తీశాడు. వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడి.. కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అక్కడితో ఆగకుండా.. వీడియోలను ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు.

అయితే సత్యారావు పంపిన వీడియోలు చూపించి.. తన ఫ్రెండ్స్ కూడా బాలికపై వేధింపులకు పాల్పడ్డట్లు గుర్తించారు. గత నెల 3 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు.. పలుమార్లు శారీరకంగా వేధించారు. అయితే బాలిక ఇంట్లో ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆశ్రయించగా.. ఈ దారుణానికి కారణం అటెండర్ సత్యారావు అని తేలింది. సత్యారావుపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే సత్యారావు ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడా..? లేక మరెవరైనా ఉన్నారా..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే తమ దర్యాప్తులో సత్యారావు ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డట్లు తేలిందని.. పోలీసులు వివరిస్తున్నారు. మరో ముగ్గురు దాడి చేసినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు.


Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×