E-Paper
Advertisement

Vizag : మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు..

Vizag : మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు..
Advertisement
Vizag

Vizag news today telugu(Breaking news in Andhra Pradesh): నేవీ అధికారి కూతురుపై అత్యాచారం.. విశాఖలో తీవ్ర సంచలనం రేపుతోంది. కంచరపాలెంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై.. ఆమె చదువుతున్న స్కూల్ లో అటెండర్ గా పనిచేస్తున్న సత్యారావు దారుణానికి ఒడిగట్టాడు. కంచరపాలెంలో గతకొంతకాలంగా జరుగుతున్న ఈ అరాచకం ఆలస్యంగా వెలుగుచూసింది. పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్న బాధిత విద్యార్థినిని ట్రాప్ చేసిన అటెండర్ సత్యారావు.. డ్రాయింగ్ నేర్పిస్తా అని చెప్పి దగ్గరయ్యాడు. ఆమెకు తెలియకుండా నగ్న వీడియోలు తీశాడు. వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడి.. కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అక్కడితో ఆగకుండా.. వీడియోలను ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు.

Advertisement

అయితే సత్యారావు పంపిన వీడియోలు చూపించి.. తన ఫ్రెండ్స్ కూడా బాలికపై వేధింపులకు పాల్పడ్డట్లు గుర్తించారు. గత నెల 3 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు.. పలుమార్లు శారీరకంగా వేధించారు. అయితే బాలిక ఇంట్లో ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో వెంటనే విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆశ్రయించగా.. ఈ దారుణానికి కారణం అటెండర్ సత్యారావు అని తేలింది. సత్యారావుపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే సత్యారావు ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడా..? లేక మరెవరైనా ఉన్నారా..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అయితే తమ దర్యాప్తులో సత్యారావు ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డట్లు తేలిందని.. పోలీసులు వివరిస్తున్నారు. మరో ముగ్గురు దాడి చేసినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు.

Related News

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

Big Stories

Advertisement
×