BigTV English

YCP Leaders : వాలంటీర్లపై కామెంట్స్.. పవన్ పై వైసీపీ లీడర్స్ ఫైర్..

YCP Leaders : వాలంటీర్లపై కామెంట్స్.. పవన్ పై వైసీపీ లీడర్స్ ఫైర్..

YCP Leaders vs Janasena Pawan Kalyan(AP Politics): జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి. పవన్‌ చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నం తినేవాడెవడైనా వాలంటీర్లను తిడతాడా? అని మరో మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవ చేశారని గుర్తు చేశారు.


పవన్‌ పోరాటం.. ఆరాటం అంతా చంద్రబాబు కోసమేనని మాజీ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్ కన్నా క్రిమినల్ ఎవరున్నారు? అని ప్రశ్నించారు. జగన్ గద్దెదించి.. ఎవర్ని గద్దెనెక్కిస్తావో చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్ మండిపడ్డారు. జగన్‌ను ఏకవచనంతో పిలిచే అర్హత జనసేనానికి లేదని స్పష్టం చేశారు.

పవన్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. చంద్రబాబు కాళ్లు మొక్కితే తమకేమి ఇబ్బంది లేదంటూ కౌంటర్‌ ఇచ్చారు. వాలంటీర్‌ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్‌కు భయం పట్టుకుందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్‌కు మంచి పేరు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తామని మేనిఫెస్టో‍లో పెట్టాలని సవాల్‌ చేశారు.


పవన్‌ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. కరోనా సమయంలో పవన్‌ ఫాంహౌస్‌లో పడుకున్నారని.. వాలంటీర్ల మాదిరిగా ప్రజలకు సేవ చేయలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. పవన్‌ ఎప్పటికీ నటుడే కానీ రాజకీయ నాయకుడు కాలేరని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు విమర్శించారు.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×