E-Paper
Advertisement

Flex War In AP : వైసీపీ, జనసేన.. సై అంటే సై.. బెజవాడలో ఫ్లెక్సీ వార్..

Flex War In AP :  వైసీపీ, జనసేన.. సై అంటే సై.. బెజవాడలో ఫ్లెక్సీ వార్..
Advertisement
Flex War In AP

Flex War In AP : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. అధికార, ప్రతి పక్ష పార్టీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలంటూ వైసీపీ శ్రేణులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలో ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలస బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సిద్ధం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్కీములే తన ప్రచార అస్త్రాలని ప్రకటించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానని జగన్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం నుంచి మేలు జరిగిందని భావిస్తే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Advertisement

ఇక సిద్ధం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫెక్సీలను ఏర్పాటు చేసి కార్యకర్తలతో కొట్టించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇలా ఎన్నికల రణరంగంలోకి జగన్ దూకుడుగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలకు కౌంటర్ గా జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి యుద్ధానికి సై అన్నారు. వైసీపీ, జనసేన మధ్య బెజవాడలో ఇలా ఫెక్సీ వార్ మొదలైంది. జనసేన ఫ్లెక్సీలో మేమూ సిద్ధమే అంటూ రాశారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

Related News

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

Big Stories

Advertisement
×