E-Paper
Advertisement

YCP Leaders : బాబు చేతిలో జోకర్ పవన్.. జనసేనానిపై వైసీపీ కౌంటర్ ఎటాక్..

YCP Leaders : బాబు చేతిలో జోకర్ పవన్.. జనసేనానిపై వైసీపీ కౌంటర్ ఎటాక్..
Advertisement

YCP Leaders : శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభలో ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు పొలిటికల్ హీట్ ను పెంచాయి. పవన్ పై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ కు దిగారు. తనను సంబరాల రాంబాబు అని వ్యాఖ్యానించడం అంబటి సెటైర్లు వేశారు. ‘ నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి’ అని అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. పీకే అంటే పిచ్చి కుక్క అని, పవన్‌.. చంద్రబాబు జోకర్‌వి అని విమర్శించారు.

పవన్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా ఘాటుగా సమాధానమిచ్చారు. డైమండ్ రాణి అని సంబోధించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండుచోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అంటూ రోజా మండిపడ్డారు.

Advertisement

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్‌‌ ముందే ఒప్పేసుకున్నారంటూ
కామెంట్‌ చేశారు. ఐటీశాఖ మంత్రి పేరు పవన్ కు తెలియదన్నారు. కనీసం భార్యల పేర్లైనా గుర్తున్నాయా? గుర్తుపెట్టుకోవాలి కదా! బహుశా ప్యాకేజీ ఇచ్చిన చంద్రబాబు పేరు మినహా ఎవరి పేరు గుర్తుండదేమో? అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు.

కాపులను మూట కట్టి తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టేద్దామనే ఆలోచన పవన్ కు ఉందేమోనని అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ తప్ప బీజేపీ , సీపీఐ, సీపీఎం , బీఎస్పీ తోపాటు అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈసారి నీ బెండు తీయడం ఖాయమని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసేసుకో.. ఇవ్వాల్సిన అందరికీ భరణాలు ఇచ్చేసేయ్ అంటూ సెటైర్లు వేశారు. ముత్తైదువులను పక్కన కూర్చోబెట్టుకుంటావు అందులోకి ఒక వెన్నుపోటు దారుడు ఉన్నాడని బాబుపై సెటైర్‌ వేశారు.

Advertisement

పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే..తాను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానని మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అద్భుతమైన ప్రజా మోద కార్యక్రమాల వల్ల 2024లో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×