E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!
Advertisement

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించాలనుకున్న ‘ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం జనసేన వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

అనుమతి నిరాకరణకు కారణాలు ఇవే..

Advertisement

ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ వేడుకులు జరుగుతండటం, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ  సభకు పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, రాజకీయ ఒత్తిళ్ల వల్లే ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఈ సభను అడ్డుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసిన సంగతి తలిసిందే.

హైకోర్టు వైపు జనసేన చూపు

Advertisement

ప్రభుత్వ నిర్ణయంపై జనసేన లీగల్ టీమ్ రంగంలోకి దిగింది. సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, సభ జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో గచ్చిబౌలి పరిసరాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది.

Also Read: అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా..! జ‌నాల‌కు చెప్పేదొక‌టి…ఇక్క‌డ జ‌రిగేదొక‌టి!

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×