Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ మాజీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి నందమూరి లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి వైఎస్ జగన్ రాష్ట్రంలో 104 సీట్లు గెలిచారు కానీ 11 సీట్లు గెలిచినట్లు ప్రకటించారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేటికి ఆద్రప్రదేశ్ లో అవే బ్రిటీష్ విదానాలను అమలు చేస్తున్నారని అన్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో నిరంకుష విధానాలు అమలవుతున్నాయని అన్నారు.
Also Read: హైదరాబాద్లో సాయంత్రం పవన్ మీడియా సమావేశం, దీనికైనా పోలీసులు పర్మిషన్ ఇస్తారా?
ఆనాడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అతి ముఖ్యంగా ఈవీఎంల పనితీరు పై ఆమె తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నూతన సాంకేతికతను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ప్రజా ఓట్ల ఫలితాలను తారుమారు చేసి ఉంటాననే ఉద్దేశ్యంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు మోన్న జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోలేదని అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 104 సీట్లు గెలిచారు కానీ 11 సీట్లు గెలిచినట్లు ప్రకటించారని తెలిపారు. అయితే దీనిని భట్టి చేస్తూ మహిళలు రాష్ట్రంలో ఎలాంటి దోరణిలో ఉన్నామో మనం అర్థం చేసుకొవాలని అన్నారు.
2024 ఎన్నికల్లో #YSJagan ఓడిపోలేదు.
నిజానికి జగన్ 104 సీట్లు గెలిచారు… కానీ 11 సీట్లు గెలిచినట్లు ప్రకటించారు.
– నందమూరి లక్ష్మీ పార్వతి pic.twitter.com/xaiLfYYwUq
— cinee worldd (@Cinee_Worldd) June 1, 2026
Also Read: తెలంగాణ మంత్రి వర్గ విస్తరనకు ఖర్గే గ్రీన్ సిగ్నల్.. చాన్స్దక్కే ముగ్గురు లీడర్లు వీళ్లే..!