E-Paper
Advertisement

AP Council Session-2026: మండలిలో ఏం జరిగింది? షాకైన వైసీపీ, వ్యూహం చూస్తారంటూ మంత్రి వ్యాఖ్య

AP Council Session-2026: మండలిలో ఏం జరిగింది? షాకైన వైసీపీ, వ్యూహం చూస్తారంటూ మంత్రి వ్యాఖ్య
Advertisement

AP Council Session-2026: మండలిలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫలితంగా వైసీపీ సభ్యుల ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మండలిలో ఏం జరిగింది? షాకైన వైసీపీ సభ్యులు

Advertisement

ఏపీలో మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార-విపక్షాలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం మండలిలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు. వాయిదా తీర్మానాలు తిరస్కరణతో ఒక్కసారిగా మండలిలో గందరగోళం నెలకొంది.

ఛైర్మన్ నిర్ణయంతో వైసీపీ సభ్యులు షాకయ్యారు. ఒక్కసారి తిరస్కరించిన వాయిదా తీర్మానాన్నిమరోసారి ఇచ్చేందుకు వీల్లేదని మండలి ఛైర్మన్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్టు వివరించారు.  హౌస్ ఆర్డర్‌లో పెట్టిన తర్వాత క్వశ్చన్ అవర్ నడుపుదామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ క్రమంలో సభలో సభ్యులు ఆందోళన చేయడంతో సభను ఛైర్మన్ వాయిదా వేశారు.

Advertisement

అసెంబ్లీ లాబీల్లో మంత్రి లోకేష్ చిట్ చాట్.. మీరు చూస్తారంటూ వ్యాఖ్య

మండలి వాయిదా తర్వాత అసెంబ్లీ లాబీల్లో మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు. మండలిలో వైసీపీ ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ నేతలపై పట్టు కోల్పోయారని అన్నారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారన్నారు.

ఒకరు లడ్డూ కల్తీపై చర్చకు అడిగితే.. మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చ అడిగారని గుర్తు చేశారు. వారి కొట్లాటలో ఎవరు పైచేయి సాధిస్తారో మాకు ఆసక్తిగా ఉందన్నారు. సభలో మా వ్యూహమేంటో మీరు చూస్తారంటూ చెప్పుకొచ్చారు సదరు మంత్రి లోకేష్.  దీంతో సభ ప్రారంభంలో వాయిదా పడింది.

ALSO READ: మదనపల్లిలో చిన్నారి ఘటన.. నిందితుడు కులవర్థన్ మృతి

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×