YS Sharmila attack on CM Jagan: పోలింగ్కు సమయం దగ్గర పడుతుండడంతో నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. తాజాగా సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? ఓటర్లు మీరే ఆలోచించుకోవాలన్నారు వైఎస్ షర్మిల. ఓటు అన్నది మీ బిడ్డల జీవితాలకు సంబంధించిన విషయమన్నారు. బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో రోడ్ షో నిర్వహించారు వైఎస్ షర్మిల. ప్రత్యేకహోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీ, తెచ్చిందా అంటూ ప్రశ్నంచారు. ఈ లెక్క వైసీపీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. ఓటు అనేది మీ చేతిలో ఆయుధమని, జగన్కు ఓటు వేస్తే డ్రైనేజ్లో వేసినట్టేనని దుయ్యబట్టారు.
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమేనని అన్నారు వైఎస్ షర్మిల. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు రాజధానులు ఉన్నాయని, ఏపీలో మాత్రం రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ఒక్క రాజధాని చాలదు.. మూడు కావాలన్నారని, ఒక్కటైనా ఎక్కడుందని సూటిగా సీఎం జగన్పై బాణం ఎక్కుపెట్టారు.
ALSO READ: జగన్బాబు నీకిది తగునా, నిందితులకే రక్షణా?
టీడీపీ ప్రభుత్వంలో రాజధానిని నిర్మిస్తామని చెప్పారని ఎక్కడుందని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. పాలకుల మాటలు నమ్మి 33వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారని, చివరకు రాజధాని కాదు కదా రైతులంతా అన్యాయమైపోయారన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే.. ప్రత్యేకహోదా, పోలవరం, రాజధాని వస్తాయని వాటి కోసమైనా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతున్నారు వైఎస్ షర్మిల.
మన చేతిలో చిప్ప తప్ప.. ఏమీ లేదు!
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా వ్యాఖ్యలు..#AndhraPradeshElection2024 #AndhraPolitiks #andhrapradeshcm #yssharmila #Congress #YSJaganMohanReddy #YSRCP #NewsUpdate #bigtv@INC_Andhra@realyssharmila… pic.twitter.com/SLYWRouilQ
— BIG TV Breaking News (@bigtvtelugu) April 25, 2024