Brother Anil kumar about AP Politics(Andhra news today): ఆస్తుల తగాదా నేపథ్యంలో వైఎష్ షర్మిల తనపై బురద జల్లు విధంగా ప్రచారం చేస్తున్నారన్న జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బ్రదర్ అనిల్కుమార్. అది ముమ్మాటికీ అవాస్తవమన్నారు. దాని గురించి ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాస్తవం, అవాస్తవం అనేది అందరికీ తెల్సిందేనన్నారు.
ఎన్నికల ముందు వీటిపై మాట్లాడడం సరికాదన్నారు బ్రదర్ అనిల్కుమార్. రాజకీయాల్లోకి తాను ఇన్వాల్వ్ కానని మనసులోని మాట బయటపెట్టారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్పుకొచ్చారు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేరన్నారు.
డబ్బు, పదవి కోసం కొందరు అమ్ముడుపోతారని, అన్యాయం చేసిన వారికి శిక్ష తప్పదని ఒక్కానించారు బ్రదర్ అనిల్కుమార్. కడప జిల్లా బద్వేలులో మీడియాతో మాట్లాడిన ఆయన, తొలిసారి వివేకానంద హత్య గురించి నోరు విప్పారు.
వివేకానంద మంచి నాయకుడని, ఆయన హత్య చాలా బాధాకరమన్నారు. చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. షర్మిలకు ఓటు వేయాలని తాను కోరలేదన్నారు. నా కమ్యూనిటీ తరపున నిలబడతానని తెలిపారు అనిల్కుమార్.
వైఎస్ షర్మిల జగన్ మధ్య గొడవల గల కారణం
వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య ఎవరు చేశారు.. బ్రదర్ అనిల్ మాటల్లో#YCP #congress #brotherAnilKumar #YSJagan #yssharmila #NewsUpdates #APElections2024 #viralnews #bigtvlive@ysjagan @realyssharmila pic.twitter.com/gApzrvNzGs
— BIG TV Breaking News (@bigtvtelugu) April 29, 2024