Mudragada Legacy: ముద్రగడ మరణం తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముద్రగడ వారసత్వం ఎవరదనే ప్రశ్న ఏపీ రాజకీయాల్లో బిగ్ సౌండ్ చేస్తోంది. ఆ లెగసీని చిన్న కుమారుడు గిరి కంటిన్యూ చేస్తారా అంటే రాజకీయంగా ఓకే. కానీ కాపు సామాజిక వర్గం కోసం నిత్యం పోరాడే శక్తి పటిమలు ఆయనలో ఉన్నాయా.? ఇకు ముద్రగడ కుమార్తె క్రాంతి విషయానికి వస్తే.. కనీసం తండ్రి చివరి చూపు కూడా నోచుకొనివ్వలేదు. కూటమి నేతలంతా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ సమయంలో ముద్రగడ వారసత్వాన్ని క్రాంతి కంటిన్యూ చేస్తారా?
ఏపీ రాజకీయాల్లో కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్స్.. వాళ్లు ఎటువైపు ఉంటే వాళ్లదే విజయం రాసిపెట్టుకోవచ్చు. అందుకే కాపు సామాజిక వర్గాన్ని సొంతం చేసుకునేందుకు అన్నిపార్టీలు పోటీ పడుతున్నాయి. వైసీపీ నేతగానే ముద్రగడ చనిపోవడం. ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో ఉండడంతో కాపులను ఓన్ చేసుకునేందుకు వైసీపీ ట్రై చేస్తుంది ఆ పార్టీ అధినేత జగన్.. ముద్రగడ పాడెను మోయడం, చివరి క్రతువు ముగిసేవరకు అక్కడే ఉండటం చాలామందిని ఆకట్టుకుంది.
Also read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!
ముద్రగడ బతికున్న సమయంలో రాజకీయంగా ఆయనతో టీడీపీ, జనసేన విబేధించినా.. చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని భావించింది. ఆ సమయంలో జరిగిన రచ్చను రెండు తెలుగు రాష్ట్ట్రాల ప్రజలు కళ్లారా చూశారు. ఇన్ని పరిణామాల మధ్య కాపుసామాజిక వర్గం ఏ నేతకు జై కొడతారు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు.
Also read: Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!