Puri Rath Yatra: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే పూరీ జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాల్లో విషాదం జరిగింది. ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ రథోత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలు మూడు భారీ రథాలపై ఊరేగుతూ తమ పిన్ని ఇల్లైన శ్రీగుండిచా ఆలయానికి వెళ్లడం సంప్రదాయం. ఆ స్వామివారి రథం తాడును ఒక్కసారైనా తాకితే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ వీధులన్నీ జనసంద్రంగా మారాయి.
రథయాత్ర సాగుతుండగా, శ్రీగుండిచా ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో భారీ తోపులాట, తొక్కిసలాట జరిగాయి. జనం కిక్కిరిసిపోవడంతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఇందులో 120 మందికి పైగా భక్తులు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ప్రశాంతంగా సాగుతున్న ఉత్సవంలో ఒక్కసారిగా గందరగోళం, భయాందోళనలు రేగాయి.
Also read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!
పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే స్పందించి గ్రీన్ ఛానల్ ద్వారా స్పృహ తప్పిన భక్తులందరినీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత పూరీలో అధికారులు భద్రతను పెంచారు.
Storey By: Anup Big Tv
Also read: Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!