E-Paper
Advertisement

Rahul Gandhi news: రాహుల్‌‌గాంధీ అన్‌స్టాపబుల్.. ఎనీ టైమ్ విత్ పబ్లిక్‌..

Rahul Gandhi news: రాహుల్‌‌గాంధీ అన్‌స్టాపబుల్.. ఎనీ టైమ్ విత్ పబ్లిక్‌..
Rahul Gandhi latest news

Rahul Gandhi latest news(Congress party news today): తెల్లవారుజాము 4 గంటలు. దేశమంతా మత్తుగా నిద్రపోతున్న వేళ. రాహుల్‌గాంధీ మాత్రం ప్రజల కోసం మేల్కొన్నారు. జనం కష్టాలు తెలుసుకునేందుకు ఎర్లీ మార్నింగ్ రోడ్డెక్కారు. నేరుగా ఢిల్లీలోని ప్రముఖ మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండీకి వెళ్లారు. ఆ టైమ్‌లో.. మార్కెట్‌లో రాహుల్‌ను చూసి అంతా అవాక్కయ్యారు.

మండీ మొత్తం కలియతిరుగుతూ.. కూరగాయలు, పండ్ల వ్యాపారులు, కార్మికులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లో పండ్లు, కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో కనుక్కున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. రాహుల్ అంతటి వాడు.. అలా సామాన్యులతో కలిసిపోవడం చూసి.. అంతా ఫిదా అవుతున్నారు.

భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్‌ గాంధీలో అసలుసిసలైన నాయకుడు కనిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు అత్యంత చేరువవుతున్నారు. సామాన్యుల సమస్యలు తెలియాలంటే.. తానూ కామన్‌మేన్‌లో వారితో కలిసిపోవాలని గుర్తించారు. అందుకే, బస్సెక్కి ప్రయాణీకులతో మాట కలపడం.. ఫుడ్ డెలివరీ బాయ్ బండెక్కి అతని ప్రాబ్లమ్స్ తెలసుకోవడం.. లారీలో ప్రయాణించి డ్రైవర్లు, క్లీనర్ల కష్టసుఖాలు కనుక్కోవడం.. పొలంలో దిగి రైతులు, కూలీలతో కలిసి నాట్లు వేస్తూ అన్నదాత ఆవేదన వినడం.. దాబాలో టీ తాగడం, బైక్ మెకానిక్‌లా మారడం.. ఇలా రాహుల్ ఎత్తని అవతారం లేదు. అంతా జనం గోడు వినేందుకే. నేనున్నానని హామీ ఇచ్చేందుకే.

రాహుల్ 2.0 వర్షన్ చూసి బీజేపీ దడుసుకుంటోంది. ప్రజాధారణలో మోడీని మించిపోయేలా ఉన్నారని భయపడుతోంది. అందుకే రాహుల్‌గాంధీకి మరిన్ని చిక్కులు సృష్టించేలా.. ఆయన ఎంపీ పదవిపై వేటు వేసింది. ఢిల్లీలోని ఇంటిని ఖాళీ చేయించింది. అయితే, ఆ అడ్డంకులను.. రాజకీయంగా మరింత ఎదిగేందుకు సోపానాలుగా మార్చుకున్నారు రాహుల్. ఎంపీ పదవి పోవడంతో మరింత సమయం ప్రజల కోసమే కేటాయిస్తున్నారు. ఇల్లు కూడా లేకుండా చేయడంతో.. రోడ్ల మీద తిరుగుతూ, సామాన్యులను కలుస్తూ వారి గుండెల్లో నిలచిపోతున్నారు. ఆ విధంగా వేటు వేసి రాహుల్‌గాంధీని మరింత రాటుదేలేలా చేశారంటున్నారు.

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×