E-Paper
Advertisement

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?
Advertisement

Rohingya Refugees: జూన్ 29 మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం. చుట్టూ భయం వారి భవిష్యత్తంతా చీకటి. అయినా బతకాలనే ఆశతో రెండు బోట్లలో సముద్ర ప్రయాణం మొదలుపెట్టారు 530 మంది రోహింగ్యా శరణార్థులు. ఒక బోటులో 250 మంది మరో బోటులో 280 మంది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే.

కొన్ని గంటల్లోనే..

వాళ్ల ప్లాన్ సింపుల్. ముందు థాయిలాండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి మలేషియా వెళ్లాలి. అక్కడైనా ప్రశాంతంగా బతుకుతామన్న ఆశ. కానీ కొన్ని గంటల్లోనే ఒక బోటుతో కాంటాక్ట్ పూర్తిగా కట్ అయింది. మరో బోటు కూడా కొద్ది రోజులకే సముద్రంలో మునిగిపోయినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆ బోట్ల జాడే లేదు.

విషాదానికి కారణం

Advertisement

ఆ సమయంలో బంగాళాఖాతంలో మాన్‌సూన్ తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు ఈదురుగాలులు రాకాసి అలలు. వీటికి తోడు స్మగ్లర్స్ ఉపయోగించిన పాత బోట్లు మధ్యలో ఇంజన్ ఫెయిల్యూర్ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించడం ఇవన్నీ కలిసి ఈ భారీ విషాదానికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also read: హై అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

సెర్చ్ ఆపరేషన్..

Advertisement

ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరగలేదు. అయితే బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు కొట్టుకొచ్చిన కొన్ని మృతదేహాలను స్థానిక మత్స్యకారులు గుర్తించారు. దీంతో రెండు బోట్లు సముద్రంలో మునిగిపోయాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

2017లో జరిగిన..

ఆ దేశంలో ఉన్న పరిస్థితులే రోహింగ్యాలను ఇంత పెద్ద రిస్క్ చేసేలా చేశాయి. 2017లో జరిగిన హింస తర్వాత లక్షలాది మంది తమ ఇళ్లు వదిలి పారిపోయారు. ఇప్పటికీ దాదాపు 12 లక్షల మంది బంగ్లాదేశ్ శిబిరాల్లోనే జీవిస్తున్నారు. మరో 6లక్షల మంది మయన్మార్‌లోనే ఉన్నారు.

వేలాది మంది..

ఇటీవల వారికి అంతర్జాతీయ సహాయం తగ్గడంతో తిండి కూడా కష్టమైంది. యువకులను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలు పోతాయన్నా భయం ఒకవేళ బతికితే కొత్త జీవితం దొరుకుతుందనే ఆశతో వేలాది మంది ఇలాంటి ప్రమాదకరమైన సీ రూట్స్‌నే ఎంచుకుంటున్నారు.

Storey By: Anup Big Tv

Also read: Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

Related News

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×