Rohingya Refugees: జూన్ 29 మయన్మార్లోని రఖైన్ రాష్ట్రం. చుట్టూ భయం వారి భవిష్యత్తంతా చీకటి. అయినా బతకాలనే ఆశతో రెండు బోట్లలో సముద్ర ప్రయాణం మొదలుపెట్టారు 530 మంది రోహింగ్యా శరణార్థులు. ఒక బోటులో 250 మంది మరో బోటులో 280 మంది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే.
వాళ్ల ప్లాన్ సింపుల్. ముందు థాయిలాండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి మలేషియా వెళ్లాలి. అక్కడైనా ప్రశాంతంగా బతుకుతామన్న ఆశ. కానీ కొన్ని గంటల్లోనే ఒక బోటుతో కాంటాక్ట్ పూర్తిగా కట్ అయింది. మరో బోటు కూడా కొద్ది రోజులకే సముద్రంలో మునిగిపోయినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆ బోట్ల జాడే లేదు.
ఆ సమయంలో బంగాళాఖాతంలో మాన్సూన్ తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు ఈదురుగాలులు రాకాసి అలలు. వీటికి తోడు స్మగ్లర్స్ ఉపయోగించిన పాత బోట్లు మధ్యలో ఇంజన్ ఫెయిల్యూర్ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించడం ఇవన్నీ కలిసి ఈ భారీ విషాదానికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: హై అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!
ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరగలేదు. అయితే బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు కొట్టుకొచ్చిన కొన్ని మృతదేహాలను స్థానిక మత్స్యకారులు గుర్తించారు. దీంతో రెండు బోట్లు సముద్రంలో మునిగిపోయాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఆ దేశంలో ఉన్న పరిస్థితులే రోహింగ్యాలను ఇంత పెద్ద రిస్క్ చేసేలా చేశాయి. 2017లో జరిగిన హింస తర్వాత లక్షలాది మంది తమ ఇళ్లు వదిలి పారిపోయారు. ఇప్పటికీ దాదాపు 12 లక్షల మంది బంగ్లాదేశ్ శిబిరాల్లోనే జీవిస్తున్నారు. మరో 6లక్షల మంది మయన్మార్లోనే ఉన్నారు.
ఇటీవల వారికి అంతర్జాతీయ సహాయం తగ్గడంతో తిండి కూడా కష్టమైంది. యువకులను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలు పోతాయన్నా భయం ఒకవేళ బతికితే కొత్త జీవితం దొరుకుతుందనే ఆశతో వేలాది మంది ఇలాంటి ప్రమాదకరమైన సీ రూట్స్నే ఎంచుకుంటున్నారు.
Storey By: Anup Big Tv
Also read: Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం