Revanth Reddy: ‘క్రిమినల్ వేస్ట్’.. ఒక చిన్నమాట తెలంగాణ పాలిటిక్స్ పేద్ద రచ్చకు దారి తీసింది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్పై సీఎం చేసిన వ్యాఖ్యల వెనుక నిజాలేంటి? విమర్శల వెనుక ఉద్దేశాలేంటి?.
ఇంజినీరింగ్ చదువు క్రిమినల్ వేస్ట్
దరఖాస్తు కూడా రాసే స్కిల్స్ లేనప్పుడు ఇంజినీరింట్ పట్టా ఉండి ఫయిదా ఏంటీ? చాలా మంది జాబ్ అప్లికేషన్ కూడా ఫిల్ చేయలేకపోతున్నారు. ఆమాత్రం నాలెడ్జ్ ఇవ్వకపోతే ఇంజినీరింగ్ చదువు క్రిమినల్ వేస్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో నిజమెంత అనడానికి రీసెర్చ్ అక్కర్లేదు. నాస్కామ్ డేటా వాస్తవాలను కళ్లకు కడుతుంది.
ఉద్యోగాన్వేషణలో 35 శాతం మంది
ఏటా 2లక్షల మంది ఇంజినీరింగ్ పూర్తి చేస్తే వారిలో 30 శాతం మాత్రమే ఐటీ జాబ్స్ సాధిస్తున్నారు. 15 శాతం మంది తమ టాలెంట్కు తగినట్టు కంపెనీల్లో చేరుతున్నారు. 35 శాతం మంది తమ చదువు సంబంధంలేని మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో జాబ్ వెదుక్కుంటున్నారు. మరో 35 శాతం మంది ఉద్యోగాన్వేషణలోనే ఉంటున్నారు.
సీఎం మాటల వెనక అర్థం..
టాలెంట్ వున్నసరే రాణించలేక పోవడానికి కారణం.. ఇంజీనిరింగ్ కాలేజీల్లో ఇప్పటికింకా పాతకాలం సిలబస్ను బోధించడమే అనే వాదన విన్పిస్తోంది. మార్కుల కోసం బట్టీ పట్టీ డిగ్రీలు సాధించినా కాంపిటేషన్ యుగంలో వెనుకబడుతున్నారు. అందుకే ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ను క్రిమినల్ వేస్ట్గా అభివర్ణించారు సీఎం. రాజకీయ విమర్శలు ఎలా వున్నా ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థ కు ఒక మేలుకొలుపు అంటున్నారు విద్యావేత్తలు.