Vijay Sai: కొత్త పార్టీ ఏర్పాటుకు అడుగులు విజయసాయి రెడ్డి వేస్తూనే.. జగన్పై, వైసీపీపై విమర్శల దాడిని ఎందుకు పెంచుతున్నారు..? జగన్ మత మార్పిడులను ప్రోత్సహించారంటూ విజయసాయి ఇటీవల చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారమే రేపాయ్. జగన్ చుట్టూ కొందరు వ్యక్తులు చేరి పార్టీని నడిపించారంటూ ఆయన చేసిన ఆరోపణలు కూడా వైసీపీలో చర్చకు దారితీశాయి.
ఇక్కడే అసలు పొలిటికల్ ఈక్వేషన్స్ మొదలవుతున్నాయ్. వైసీపీకి బలమైన మద్దతుదారులుగా భావించే రెడ్డి సామాజిక వర్గంలో జగన్ నాయకత్వంపై అసంతృప్తి ఉందన్న చర్చ చాలాకాలంగా ఉంది. ఆ అసంతృప్తిని తనవైపు తిప్పుకోవడమే విజయసాయి వ్యూహమా..? అందుకే జగన్పై వరుస డైలాగ్ వార్ నడుస్తోందా?
Also read: బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!
కొత్త పార్టీ పెట్టడం ఒకటైతే వైసీపీకి దూరమయ్యే ఛాన్స్ ఉన్న ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునే ప్లాన్లు నడుస్తున్నాయ్. నిజానికి వైసీపీ మాదిరిగా పార్టీ నిర్మాణం విజయసాయితో సాధ్యమేనా అన్న చర్చ కూడా ఉంది. సో కొత్త రాజకీయ శక్తి నిర్మాణం, జగన్ ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడం ఈ రెండింటి చుట్టూ విజయసాయి గేమ్ నడుస్తోంది. ప్రత్యర్థిని ఓడించడం తర్వాత సంగతి.. ప్రత్యర్థి బలాన్ని చీల్చడమే అసలు రాజకీయ వ్యూహం అన్నట్లుగా విజయసాయి అడుగులు పడుతున్నాయంటున్నారు.