E-Paper
Advertisement

EPFO: పీఎఫ్ సభ్యులకు గుడ్ న్యూస్..ఇకపై లక్ష కాదు, 5 లక్షల వరకు

EPFO: పీఎఫ్ సభ్యులకు గుడ్ న్యూస్..ఇకపై లక్ష కాదు, 5 లక్షల వరకు
Advertisement

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ సభ్యులకు మరింత ప్రయోజనం కలిగించేందుకు సరికొత్త ప్రకటన చేసింది. దీని ప్రకారం ఇకపై ముందస్తు క్లెయిమ్ (ASAC) పరిమితిని పెంచాలని నిర్ణయించింది. ఇది ప్రస్తుతం రూ.1 లక్షగా ఉన్న పరిమితిని, ఏకంగా రూ.5 లక్షలకు పెంచేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదం తెలిపింది. దీంతో కోట్లాది మంది EPFO సభ్యులకు ప్రయోజనం లభించనుంది.

PF ఉపసంహరణ పరిమితి పెంపు
EPFO సభ్యులు త్వరలో ASAC ద్వారా రూ.5 లక్షల వరకు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) నుంచి ఉపసంహరించుకోవచ్చు. ఈ నిర్ణయం 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా సమక్షంలో ఆమోదించారు.

Advertisement

ఆటో మోడ్ సెటిల్‌మెంట్
2020లో EPFO అనారోగ్య సంబంధిత క్లెయిమ్‌ల కోసం ఆటో మోడ్‌ను ప్రవేశపెట్టింది. మే 2024లో, ఆటో మోడ్ క్లెయిమ్ పరిమితిని రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచారు. ఇప్పుడు, రూ. 5 లక్షల లిమిట్ మరింత విస్తృతంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారింది.

కొత్త క్లెయిమ్ సెటిల్‌మెంట్ విధానం
EPFO మూడు ప్రధాన విభాగాలకు ఆటో-మోడ్ సెటిల్‌మెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో విద్య, వివాహం, గృహ నిర్మాణం ఉన్నాయి. ఇప్పటి వరకు, EPFO సభ్యులు అత్యవసర వైద్య ఖర్చుల కోసం మాత్రమే PF ఉపసంహరించుకునే అవకాశం కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు ఇతర అవసరాలకు కూడా ఆటో-మోడ్ ద్వారా క్లెయిమ్ పొందే అవకాశం ఉంది.

Advertisement

Read Also: Sony TV Offer: సోనీ 55 ఇంచ్ స్మార్ట్ HD టీవీపై రూ. 42 వేల …

ఆటో క్లెయిమ్ వ్యవస్థ ప్రయోజనాలు
EPFO 95% క్లెయిమ్‌లను ఆటోమేటెడ్ విధానంలో ప్రాసెస్ చేస్తోంది. కేవైసీ (KYC), అర్హత, బ్యాంక్ ధ్రువీకరణ పూర్తయిన తర్వాత, క్లెయిమ్ మూడు రోజులలోపు సెటిల్ చేయబడుతుంది. గతంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ కాలం 10 రోజులు ఉండగా, ఇప్పుడు అది 3 నుంచి 4 రోజులకు తగ్గించబడింది.

క్లెయిమ్ తిరస్కరణ నిష్పత్తి తగ్గింపు
మార్చి 6, 2025 నాటికి EPFO మొత్తం 2.16 కోట్ల ఆటో-క్లెయిమ్‌లను పరిష్కరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 89.52 లక్షల క్లెయిమ్‌లను సెటిల్ చేయగా, 2024-25లో ఈ సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. క్లెయిమ్ తిరస్కరణ శాతం గతంలో 50% ఉండగా, ఇప్పుడు 30%కి తగ్గింది.

మానవ జోక్యం లేకుండా క్లెయిమ్ సెటిల్‌మెంట్
EPFO కొత్త టెక్నాలజీని ఉపయోగించి క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను పూర్తిగా ఆటోమేట్ చేసింది. దీంతో మానవ జోక్యం లేకుండా IT వ్యవస్థ ద్వారా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు, ఖచ్చితమైన సెటిల్‌మెంట్ జరుగుతోంది.

ధ్రువీకరణ ప్రాసెస్ సరళీకరణ
EPFO తమ ధ్రువీకరణ ప్రక్రియను మరిత సులభతరం చేసింది. ఇప్పటికే 27 ధ్రువీకరణ అంశాలను 18కి తగ్గించగా, త్వరలో వాటిని 6కు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది క్లెయిమ్‌లను వేగంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది.

UPI, ATM ద్వారా PF ఉపసంహరణ
EPFO సభ్యులకు త్వరలో UPI, ATM ద్వారా PF ఉపసంహరణ చేసే అవకాశం కలుగనుంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ NPCI (National Payments Corporation of India) సిఫార్సును ఆమోదించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది మే లేదా జూన్ 2025 కల్లా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త మార్పులు EPFO సభ్యులకు మరింత లబ్ధి కలిగించేలా ఉంటాయి. ప్రస్తుత డిజిటలైజేషన్ ద్వారా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ వేగంగా జరిగి, సభ్యులకు మరింత ఉపయోగకరంగా మారుతుంది.

Related News

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

Big Stories

Advertisement
×