Gold Rate Today: గడిచిన మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ వడ్డీ రేట్ల వ్యవహారం బులియన్ మార్కెట్పై పడనుంది. ఇవాళ గురువారం మార్కెట్లో బంగారం-వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా బంగారం ధర ఒడుదొడుకులకు గురవుతున్నాయని. ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు, క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి పరిణామాలు బులియన్ మార్కెట్పై పడింది.. పడుతూనే ఉంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు నిర్ణయంతో బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు కిందటి రోజుతో పోలిస్తే తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు గురువారం ఉదయం 4270 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అటు సిల్వర్ రేటు 64.50 డాలర్ల నుంచి 63 డాలర్లకు దిగొచ్చింది.
దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గలేదు. ఉదయం 10 గంటల ధరలు అటు ఇటు మార్పులకు లోనయ్యే అవకాశముంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,450 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.
ALSO READ: అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల షాక్.. మూడేళ్ల తర్వాత పెరుగుదల, భారత్ మార్కెట్పై ప్రభావం?
దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను చూద్దాం. ఢిల్లీలో గోల్డ్ ధర రేట్లు కాస్త ఎక్కువగా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 1,53,590 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములకు వరుసగా రూ. 1,40,800 ట్రేడింగ్ జరుగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 270 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాములు రూ. 1,53,440 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 250 పెరిగి రూ. 1,40,650 వద్ద ఉంది. ఇతర నగరాలైన చెన్నై, కోల్కతా, బెంగళూరులో 100 లేదా 200 రూపాయలు అటు ఇటుగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో ఏ మాత్రం మార్పులేదు.