E-Paper
Advertisement

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!
Advertisement

Hyderabad: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ కీలక నేతల భూముల వ్యవహారాన్ని అసెంబ్లీ సాక్షిగా గుట్టు విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. జరుగుతున్న పరిణామాలను గమనించిన బీఆర్ఎస్.. తెర వెనుక పావులు జాగ్రత్తగా కదుపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా?

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు

నియోజకవర్గాల పునర్విభజనకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే కండీషన్లు పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేసీఆర్ ఫ్యామిలీ భూ కబ్జాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చిట్టా అంతా బయటపెట్టారు. ఈ సమయంలోనే కేటీఆర్ డీలిమిటేషన్‌పై వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ఎందుకంటే డీలిమిటేషన్‌ వ్యవహారంపై ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదని అంటున్నారు. తెలంగాణ రాజకీయాలను డైవర్ట్ చేసేందుకు ఇదొక ఎత్తుగడగా చెబుతున్నారు తెలంగాణ అధికార పార్టీ.

పొత్తులు-డీలిమిటేషన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Advertisement

పొత్తులు, డీలిమిటేషన్‌పై తమ పార్టీ వైఖరి వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టంచేశారు. అదే సమయంలో డీలిమిటేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందన్నారు. లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు.

బీజేపీకి బీఆర్ఎస్ సంకేతాలు?

సింపుల్‌గా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పకనే చెప్పారు. ఈ విషయాన్ని ఆయన హర్యానాలో మాట్లాడడంతో అక్కడి ఢిల్లీకి సంకేతాలు వెళ్లినట్టు ఆ పార్టీలో కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. బుధవారం హర్యానాలోని సోనిపట్‌లో జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌-ది స్టోరీ ఆఫ్‌ ఏ స్టార్టప్‌ స్టేట్‌’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సమయంలో విద్యార్థులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

Advertisement

ALSO READ: కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

నియోజకవర్గాల పునర్విభజనకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే కండీషన్లు పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన భూ కబ్జాల చిట్టా అంతా బయటపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సమయంలోనే కేటీఆర్ డీలిమిటేషన్‌పై వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. డీలిమిటేషన్‌ వ్యవహారంపై ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదని అంటున్నారు. తెలంగాణ రాజకీయాలను డైవర్ట్ చేసేందుకు ఇదొక ఎత్తుగడగా చెబుతున్నారు తెలంగాణ అధికార పార్టీ నేతలు. అందుకోసమే బీఆర్ఎస్‌పై బీజేపీ నేతలు నోరు ఎత్తలేదని అంటున్నారు.

Related News

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

Big Stories

Advertisement
×