Babar Azam On Team India: మన శత్రువు పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఫీల్డింగ్.. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ సరిగ్గా లేక ఇప్పటికే సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇంగ్లాండ్ చేతిలో తాజాగా రెండు మ్యాచ్ లలో ఊడిపోయింది. దీంతో దారుణమైన ట్రోలింగును ఎదుర్కొంటుంది.. ముఖ్యంగా బాబర్ ఆజంను (Babar Azam ) ఉద్దేశించి అత్యంత దారుణమైన పోస్టులు పెడుతున్నారు. వీడు కింగ్ కాదు… గుండు సున్నా గాడు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ముఖ్యంగా ఇండియన్ అభిమానులు బాబర్ ఆజం ఉరేసుకునే సిచువేషన్ తీసుకొస్తున్నారు. అంతలా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఓటమి బాధలో ఉన్న బాబర్ ఆజం, ఇండియన్ అభిమానులను ఉద్దేశించి, కౌంటర్ ఇచ్చారు. మమ్మల్ని ట్రోల్ చేస్తున్న…ఇండియాను WTC గడప కూడా తొక్కనివ్వబోము అంటూ బాబర్ ఆజం హెచ్చరించారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) జరుగుతున్న నేపథ్యంలో బాబర్ ఆజం పైన దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ ఫ్యాన్స్ కు బాబర్ ఆజం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పొద్దున లేస్తే చాలు తనపై ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను ట్రోల్ చేస్తే చేయండి… ముందుగా టీమిండియా పరిస్థితి ఏంటో తెలుసుకోండి అంటూ చురకలు అంటించారు. డబ్బున్న మీరే ఇంగ్లాండ్ గడ్డపై ఓడిపోయారు… మేం పెద్ద తోపులం కాదు కదా? అంటూ ప్రశ్నించారు. వెస్టిండీస్ పై గెలిచి వచ్చాం… కానీ ఇక్కడి మైదానాలు మాకు సరిపోవడంలేదని క్లారిటీ ఇచ్చారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 సైకిల్ లో ( World Test Championship 2027 cycle) తాము ఎంట్రీ ఇవ్వకపోయినా సరే… టీమిండియాను మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ( World Test Championship 2027) గడప కూడా తొక్కని ఇవ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇది కచ్చితంగా తాను చేసి చూపిస్తానని హెచ్చరించారు. చావు నోట్లోకి వెళ్లి మరి… ఇండియాను సర్వనాశనం చేస్తానని ఓ రేంజ్ లో సినిమా డైలాగులు విడిచారు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంకు అదే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ కూడా ప్రారంభమైంది. ముందుగా నీ జట్టు పరిస్థితి చూసుకోరా బేవకూఫ్.. అంటూ బాబర్ పై దారుణంగా ఇండియన్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.