RBI Coins: దేశంలో కరెన్సీతో పాటు నాణేలు విరివిరిగా చలామణి అవుతుంటాయి. అయితే ఇటీవల ఎక్కువగా కరెన్సీ మాత్రమే వినిగిస్తున్నారు. నాణేలు వేర్వేరు డిజైన్లలో ఉండడంతో వీటి పట్ల ప్రజల కాస్త అపనమ్మకం కలుగుతోంది. ఈ విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఒకే విలువ కలిగిన వేర్వేరు డిజైన్లు గల నాణేలు ఒకే సమయంలో చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు అన్నీ చట్టబద్ధమైనవి, సుదీర్ఘకాలం చెలామణిలో ఉంటాయని పేర్కొంది. నాణేల గురించి తప్పుదారి పట్టించే పుకార్లను నమ్మవద్దని ఆర్బీఐ సూచించింది. నాణేలను అన్ని బ్యాంకుల్లో ఎలాంటి సందేహం లేకుండా స్వీకరిస్తారని తెలిపింది.
కరెన్సీ, వివిధ అంశాలకు సంబంధించి వచ్చే పుకార్లపై ఆర్బీఐ పౌరులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగా నాణేలపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకు సందేశాలు పంపుతోంది. నాణేలపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను కూడా రూపొందించింది. నాణేలు వేర్వేరు డిజైన్లతో ఉన్నప్పటికీ అవన్నీ చలామణిలోనే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. అంతేకాదు 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలన్నీ చట్టబద్ధమేనని తెలిపింది.
భవిష్యత్ లోనూ నాణేలు చలామణిలో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారం లేదా పుకార్లు నమ్మొద్దని సూచించింది. వ్యాపారులకు కూడా సంకోచం లేకుండా పౌరుల నుంచి నాణేలను స్వీకరించాలని ఆర్బీఐ కోరింది. ముఖ్యంగా రూ.10 నాణేల గురించి గతంలో ఆర్బీఐ అవగాహన కల్పించింది. అయినప్పటికీ ఇంకా కొందరు వీటిని తీసుకొనేందుకు సంకోచిస్తున్నారు. అంతేకాదు 50 పైసల నాణెం ఇంకా చెల్లబాటవుతుందని ఆర్బీఐ పేర్కొంది.