E-Paper
Advertisement

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్
Advertisement

Snake in Train: రన్నింగ్ ట్రైన్ లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ లో పాము

Advertisement

సికింద్రాబాద్ నుంచి గోవాకు బయల్దేరిన సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్  జార్ఖండ్ వరకు వెళ్లింది. ఏసీ 2 టైర్ కోచ్ లో బెర్త్ మీద ఏదో కదులుతున్నట్లు ప్రయాణీకులు గుర్తించారు. ఏంటా అని బెడ్ షీట్ పక్కకు తీసి చూసే సరికి పాము కనిపించింది. ప్యాసింజర్లు భయంతో వణికిపోయారు. పక్క కోచ్ లోకి పరుగులు తీశారు. వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పారు. నెక్ట్స్ స్టాఫ్ లో రైలును ఆపి, పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు పామును బెడ్ షీట్ లోనే పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఆ పామును బయట వదిలేశాడు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ప్రయాణీకులకు ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదన్నారు. రైల్లోకి పాము ఎలా వచ్చింది అనే విషయంపై విచారణ జరుపుతామన్నారు. రైల్లో పాముకు సంబంధించి ఓ ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది. కొత్తగా ప్రారంభించిన రైల్లోకి పాములు దూరడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Lokmat Times (@lokmattimesmedia)

అక్టోబర్ 6న సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ప్రారంభం

Advertisement

సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు ఈ మధ్యే సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించింది. అక్టోబర్ 6న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నుంచి వాస్కోడిగామా స్టేషన్ కు వెళ్లే రైలు 17039 నంబర్‌ తో బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది.  ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకుంటుంది. అటు వాస్కోడిగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్ కు 17040 నంబర్‌ తో గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు  ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉన్నాయి.

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయ్యే ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, గద్వాల్, కర్నూలు,  డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాసిల్‌ రాక్‌, కులెం, సాన్వోర్‌ డెమ్, మడగావ్‌ స్టేషన్లలో ఆగుతుంది.

Read Also: సీనియర్ సిటిజెన్లకు రైళ్లలో స్పెషల్ స్పెసిలిటీస్, ఇంతకీ అవేంటో తెలుసా?

Related News

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

Big Stories

Advertisement
×