BigTV English
Advertisement

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Snake in Train: రన్నింగ్ ట్రైన్ లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ లో పాము

సికింద్రాబాద్ నుంచి గోవాకు బయల్దేరిన సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్  జార్ఖండ్ వరకు వెళ్లింది. ఏసీ 2 టైర్ కోచ్ లో బెర్త్ మీద ఏదో కదులుతున్నట్లు ప్రయాణీకులు గుర్తించారు. ఏంటా అని బెడ్ షీట్ పక్కకు తీసి చూసే సరికి పాము కనిపించింది. ప్యాసింజర్లు భయంతో వణికిపోయారు. పక్క కోచ్ లోకి పరుగులు తీశారు. వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పారు. నెక్ట్స్ స్టాఫ్ లో రైలును ఆపి, పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు పామును బెడ్ షీట్ లోనే పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఆ పామును బయట వదిలేశాడు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ప్రయాణీకులకు ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదన్నారు. రైల్లోకి పాము ఎలా వచ్చింది అనే విషయంపై విచారణ జరుపుతామన్నారు. రైల్లో పాముకు సంబంధించి ఓ ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది. కొత్తగా ప్రారంభించిన రైల్లోకి పాములు దూరడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Lokmat Times (@lokmattimesmedia)

అక్టోబర్ 6న సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ప్రారంభం

సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు ఈ మధ్యే సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించింది. అక్టోబర్ 6న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నుంచి వాస్కోడిగామా స్టేషన్ కు వెళ్లే రైలు 17039 నంబర్‌ తో బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది.  ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకుంటుంది. అటు వాస్కోడిగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్ కు 17040 నంబర్‌ తో గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు  ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉన్నాయి.

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయ్యే ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, గద్వాల్, కర్నూలు,  డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాసిల్‌ రాక్‌, కులెం, సాన్వోర్‌ డెమ్, మడగావ్‌ స్టేషన్లలో ఆగుతుంది.

Read Also: సీనియర్ సిటిజెన్లకు రైళ్లలో స్పెషల్ స్పెసిలిటీస్, ఇంతకీ అవేంటో తెలుసా?

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×