BigTV English

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Snake in Train: రన్నింగ్ ట్రైన్ లో ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ లో పాము

సికింద్రాబాద్ నుంచి గోవాకు బయల్దేరిన సికింద్రాబాద్‌ –వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్  జార్ఖండ్ వరకు వెళ్లింది. ఏసీ 2 టైర్ కోచ్ లో బెర్త్ మీద ఏదో కదులుతున్నట్లు ప్రయాణీకులు గుర్తించారు. ఏంటా అని బెడ్ షీట్ పక్కకు తీసి చూసే సరికి పాము కనిపించింది. ప్యాసింజర్లు భయంతో వణికిపోయారు. పక్క కోచ్ లోకి పరుగులు తీశారు. వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పారు. నెక్ట్స్ స్టాఫ్ లో రైలును ఆపి, పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు పామును బెడ్ షీట్ లోనే పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఆ పామును బయట వదిలేశాడు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ప్రయాణీకులకు ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదన్నారు. రైల్లోకి పాము ఎలా వచ్చింది అనే విషయంపై విచారణ జరుపుతామన్నారు. రైల్లో పాముకు సంబంధించి ఓ ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది. కొత్తగా ప్రారంభించిన రైల్లోకి పాములు దూరడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Lokmat Times (@lokmattimesmedia)

అక్టోబర్ 6న సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ప్రారంభం

సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు ఈ మధ్యే సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్ ను ప్రారంభించింది. అక్టోబర్ 6న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నుంచి వాస్కోడిగామా స్టేషన్ కు వెళ్లే రైలు 17039 నంబర్‌ తో బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది.  ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకుంటుంది. అటు వాస్కోడిగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్ కు 17040 నంబర్‌ తో గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు  ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉన్నాయి.

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయ్యే ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, గద్వాల్, కర్నూలు,  డోన్‌, గుంతకల్‌, బళ్లారి, హోస్పేట, కొప్పల్‌, గడగ్‌, హుబ్బళ్లి, ధార్వాడ్‌, లోండా, క్యాసిల్‌ రాక్‌, కులెం, సాన్వోర్‌ డెమ్, మడగావ్‌ స్టేషన్లలో ఆగుతుంది.

Read Also: సీనియర్ సిటిజెన్లకు రైళ్లలో స్పెషల్ స్పెసిలిటీస్, ఇంతకీ అవేంటో తెలుసా?

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×