E-Paper
Advertisement

Watermelon prices crash: కిలో పుచ్చకాయ రేటు రూ.7 మాత్రమేనా? యుద్ధం వల్లేనా.. రేట్లు తగ్గడానికి కారణాలేమిటీ?

Watermelon prices crash: కిలో పుచ్చకాయ రేటు రూ.7 మాత్రమేనా? యుద్ధం వల్లేనా.. రేట్లు తగ్గడానికి కారణాలేమిటీ?
Advertisement

Watermelon prices crash: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావం భారతీయ పండ్ల ఎగుమతులపై తీవ్రంగా పడింది. యూఏఈ బహ్రెయిన్ ఒమన్ వంటి గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి జరిగే పండ్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎగుమతి కావలసిన భారీ నిల్వలు ఇప్పుడు దేశీయ మార్కెట్లకు మళ్లించడంతో ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి. టోకు మార్కెట్లలో పుచ్చకాయ ధర కిలో కేవలం రూ. 7 వరకు పడిపోయింది. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఎగుమతిదారులు తీవ్ర నష్టాలను చూస్తున్నారు.

సాధారణంగా రంజాన్ మాసంలో గల్ఫ్ దేశాల నుంచి పుచ్చకాయలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏటా భారత్ నుంచి వేల మెట్రిక్ టన్నుల పండ్లను ఖతార్ యూఏఈ వంటి దేశాలకు పంపిస్తుంటారు. అయితే ఈసారి యుద్ధం కారణంగా షిప్పింగ్ లైన్లు సేవలను నిలిపివేయడంతో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) వంటి రేవుల్లో వందలాది కంటైనర్లు పేరుకుపోయాయి. భవిష్యత్తులో రావాల్సిన ఆర్డర్లు కూడా రద్దు కావడంతో పండించిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పూణేకు చెందిన ఒక ఎగుమతిదారు తెలిపిన వివరాల ప్రకారం కిలో రూ. 25 ఉండాల్సిన ధర ఇప్పుడు రూ. 7 కి కూడా దిగివచ్చేలా ఉంది.

Advertisement

ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో ధరల పతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో రూ. 3,275 గా ఉన్న క్వింటాల్ ధర కేవలం ఒక్క నెలలోనే 29 శాతం తగ్గి రూ. 2,301 కి పడిపోయింది. విదేశాలకు వెళ్లాల్సిన సరుకు ఒక్కసారిగా స్థానిక మార్కెట్లకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో కూడా పుచ్చకాయల ధరలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రంజాన్ కోసం సిద్ధం చేసిన పంట ఇప్పుడు భారతీయ మార్కెట్లలో వరదలా ముంచెత్తుతోందని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టోకు మార్కెట్లలో ధరలు భారీగా తగ్గినప్పటికీ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రం ఇంకా అధిక ధరలే కొనసాగుతున్నాయి. ముంబై ఢిల్లీ వంటి నగరాల్లో ఆన్‌లైన్ యాప్స్ ద్వారా మూడు కిలోల పుచ్చకాయను రూ. 100 నుండి రూ. 140 వరకు విక్రయిస్తున్నారు. బెంగళూరులో కూడా రిటైల్ ధరలు కిలో రూ. 80 కి పైగానే ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం రవాణా ఖర్చులు ఎక్కువ కావడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. సామాన్య ప్రజలకు తక్కువ ధరకే పండ్లు అందుబాటులోకి వచ్చినా ఎగుమతులపై ఆధారపడిన రైతులు మాత్రం ఈ యుద్ధం వల్ల కోలుకోలేని దెబ్బ తిన్నారు.

Advertisement

Read Also: Iran War: ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు.. ఎన్నడూ లేనంత స్థాయిలో అటాక్, అమెరికా సంచలనం

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×