E-Paper
Advertisement

Three College Students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Three College Students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Three College Students Died: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు అతివేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు కుత్భుల్లాపూర్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Also Read: ఫేక్ పోలీసు డీపీ..పెడతారు నెత్తిన టోపీ

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా విజ్ఞాన్ జ్యోతి కాలేజీ విద్యార్థులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులకు మృతల వివరాలను తెలియజేయగా వారు బోరున విలవిపిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణిస్తారనుకుంటే ఇలా ప్రమాదానికి గురై తమను వదిలి వెళ్లారంటూ గుండెలవిసేలా దు:ఖిస్తున్నారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×