E-Paper
Advertisement

Madhya Pradesh Crime: ఫ్రెండ్‌తో బయటకు వెళ్లిన యువతి.. వారిని కొట్టి, ఆ తర్వాత యువతిపై

Madhya Pradesh  Crime: ఫ్రెండ్‌తో బయటకు వెళ్లిన యువతి.. వారిని కొట్టి, ఆ తర్వాత యువతిపై

Madhya Pradesh Crime: కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిలోని కొన్ని గుణాలు బయటపడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లింది ఓ యువతి. అమ్మాయి ఫ్రెండ్స్‌ని కొట్టిన ఇద్దరు యువకులు, ఆ తర్వాత సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది?

మధ్య‌ప్రదేశ్‌‌లో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

మధ్య‌ప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఒక యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు యువతి సహచరుడిపై దాడి చేశారు. ఆ తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జనవరి 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లింది.

వారిని దారి మధ్యలో అడ్డగించారు జైగోపాల్ గౌర్, సుందర్ భగవాన్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులు. యువతిలో వెళ్లినవారిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఒకరు వారి నుంచి బలవంతంగా అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు యువకులు ఆ యువతిని అడవిలోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఫ్రెండ్స్‌తో అటవీ ప్రాంతానికి యువతి.. వారిని కొట్టి ఆపై అత్యాచారం

ప్రాణాలతో బయటపడిన వ్యక్తి సమీపంలోని ఓ ప్రాంతానికి చేరుకున్నాడు. జరిగిన విషయాన్ని స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ రాత్రి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రాణాలతో బయటపడిన యువతికి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బాధిత యువతి వాంగ్మూలం నమోదు చేశారు.

ఆమె ఫిర్యాదు ఆధారంగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఘటన జరిగిన కొన్ని రోజుల్లో నిందితులను అరెస్టు చేశారు. సీనియర్ అధికారులు కేసుని పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ALSO READ: ఎస్ఐని ఢీకొట్టి బానెట్‌పై 4 కిలోమీటర్లు తీసుకెళ్లిన కారు.. తప్పించుకున్న ఎస్ఐ

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×