E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురు మృతి
Advertisement

Road Accident: అతివేగం ప్రమాదకరం.. రహదారులపై పదే పదే బోర్డులున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు, డివైడర్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది?

రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

రాజస్థాన్‌లో దౌసా జిల్లాలోని 21వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కైలై గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఎదురుగా వస్తున్న ట్రైలర్‌ను ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఐదుగురు స్పాట్ లో మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో కారు నుజ్జుకావడంతో మృతదేహాలను బయటకు తీయడం కష్టంగా మారింది.

Advertisement

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురు మృతి

చివరకు వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని జైపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్నవారు కలఖో గ్రామానికి చెందినవారు. ఓ వివాహం తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు గాయపడ్డారు. దీంతో కలఖో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అతివేగం వల్ల వాహన నియంత్రణ కోల్పోవడం ప్రమాదానికి కారణమైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం గురించి తెలియగానే యువకుల కుటుంబ సభ్యులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. తమ కొడుకులను ఆ విధంగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.

ALSO READ: 13 కీ.మీ తమ్ముడి శవాన్ని బైక్‌పై తరలించిన అన్నదమ్ములు!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×