E-Paper
Advertisement

Loan App Harassment : లోన్ యాప్ వేధింపులు.. మరో విద్యార్థి ఆత్మహత్య!

Loan App Harassment : లోన్ యాప్ వేధింపులు.. మరో విద్యార్థి ఆత్మహత్య!

Engineering Student Suicide Due to Loan App Harassment in AP: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నదిలో విద్యార్థి మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన వంశీ అనే విద్యార్థి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

అయితే.. అతను ఇంట్లోవాళ్లకు తెలియకుండా లోన్ యాప్ లో రూ.10 వేల రుణం తీసుకున్నాడు. ఆ లోన్ యాప్ నిర్వాహకులు రూ. లక్ష వరకు డబ్బులు చెల్లించాలంటూ అతడిని వేధించారని, దీంతో అతను ఆ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పకుండా భయపడి ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది.

Also Read: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూత

వంశీ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా అతని ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా నది వద్ద అతడి మొబైల్ ఫోన్, చెప్పులు, బైక్ కనిపించాయి. అనుమానంతో నదిలో గాలింపు చేపట్టగా అతడి మృతదేహం లభ్యమైంది. తండ్రి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×