E-Paper
Advertisement

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు, స్పాట్ లో ఐదుగురు మృతి

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు, స్పాట్ లో ఐదుగురు మృతి
Advertisement

Road Accident: అతి వేగం ఐదుగురు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఘటన గురించి సమాచారం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే మృతులు ఎక్కడివారు అనేదానిపై ఆరా తీస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తున్న కారు, అదుపు తప్పి బలంగా లారీని ఢీ కొట్టింది. చిత్తూరు-బెంగుళూరు జాతీయ రహదారిపై పలమనేరు‌లోని వైఎస్సార్ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు స్పాట్‌లో మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

ప్రమాదానికి గురైన కారు బెంగుళూరు నుంచి చిత్తూరు వైపు వస్తోంది. పలమనేరు వైఎస్సార్ జంక్షన్ వద్దకు వచ్చిన తర్వాత కర్నూలు వెళ్తున్న సిమెంట్ లారీనివెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

లారీని ఢీ కొట్టిన కారు, స్పాట్ లో ఐదుగురు మృతి

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అతి కష్టం మీద లారీ నుంచి కారు వేరు చేశారు. అప్పటికే కారులోని వారంతా నుజ్జునుజ్జు అయ్యారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. కారులోని ఏ ప్రాంతానికి చెందినవారు? ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

పోలీసులు మాత్రం బెంగుళూరు నుంచి చిత్తూరు వస్తున్న కారు ప్రమాదానికి గురైనట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు నుంచి ఎగిరిపడ్డ ప్రయాణికులు

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×